logo

నేడు భాజపా ‘ప్రజా గోస’

మండల పరిధిలోని గ్రామాల్లో సోమవారం ‘ప్రజా గోస-భాజపా భరోసా’ పేరిట ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10గంటలకు అల్లాపూర్‌లో ప్రారంభమయ్యే 

Published : 08 Aug 2022 02:58 IST

బండి సంజయ్‌తో తాండూరు నేతలు  

తాండూరు గ్రామీణ: మండల పరిధిలోని గ్రామాల్లో సోమవారం ‘ప్రజా గోస-భాజపా భరోసా’ పేరిట ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ మండలాధ్యక్షులు శేఖాపురం ఆంజనేయులు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10గంటలకు అల్లాపూర్‌లో ప్రారంభమయ్యే  సాయంత్రం చెంగోల్‌లో ముగుస్తుందన్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కె.అరుణ, మాజీ మంత్రి కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు సదానంద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు.
తాండూరు: తాండూరులోని భాజపా నాయకులు ఆదివారం రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిశారు. నల్లగొండ జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ప్రజా సంగ్రామ పాదయాత్రలో కొద్ది సేపు బండి సంజయ్‌తో కలిసి పాద యాత్ర చేశారు. కార్యక్రమంలో తాండూరు నియోజకవర్గం భాజపా మహిళా నాయకురాలు జయశ్రీపటేల్‌, యువమోర్చ నాయకులు తాండ్ర నరేష్‌, శ్రీశైలం, ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని