logo

రెండు ఏటీఎంల ధ్వంసం

కూకట్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ ఠాణాల పరిధిలో రెండు ఏటీఎంలను దుండగులు ధ్వంసం చేశారు. కూకట్‌పల్లి డీఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. భాగ్యనగర్‌ కాలనీలోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం ధ్వంసమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.

Published : 08 Aug 2022 02:58 IST


భాగ్యనగర్‌కాలనీలో..

కేపీహెచ్‌బీకాలనీ, పేట్‌బషీరాబాద్‌, న్యూస్‌టుడే: కూకట్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ ఠాణాల పరిధిలో రెండు ఏటీఎంలను దుండగులు ధ్వంసం చేశారు. కూకట్‌పల్లి డీఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. భాగ్యనగర్‌ కాలనీలోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎం ధ్వంసమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. యంత్రంలో నగదు వచ్చే చోట పగలగొట్టారు. కింద పగిలిన ఇటుకలు ఉండటంతో దాంతోనే గుర్తుతెలియని వ్యక్తి శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో.. పేట్‌బషీరాబాద్‌ పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లి లక్ష్మీనగర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం నుంచి శనివారం అర్ధరాత్రి దుండగులు డబ్బులు దొంగిలించటానికి విశ్వప్రయత్నం చేశారు. డబ్బులు రాకపోవడంతో విసిగిపోయి యంత్రాన్ని పగలగొట్టారు. ఎంతమంది నిందితులు, ఏ సమయంలో వచ్చారో తెలుసుకునేందుకు అక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని