logo

జాతీయ భావాన్ని పెంపొందించేందుకే ‘హర్‌ ఘర్‌ తిరంగా’

ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించి దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ‘హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌’ దోహదపడుతుందని భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు అన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించే ‘హర్‌ ఘర్‌ తిరంగా’

Published : 08 Aug 2022 02:58 IST


ర్యాలీలో గౌతంరావు, కార్పొరేటర్లు, నేతలు

బర్కత్‌పుర, న్యూస్‌టుడే: ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొందించి దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ‘హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్‌’ దోహదపడుతుందని భాజపా హైదరాబాద్‌ సెంట్రల్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.గౌతంరావు అన్నారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో నిర్వహించే ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతూ భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం ‘తిరంగా యాత్ర-బైక్‌ ర్యాలీ’ నిర్వహించారు. బర్కత్‌పురలోని భాజపా నగర కార్యాలయం నుంచి అంబర్‌పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగింది. భాజపా నేత బి.వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు కె.ఉమారాణి, బి.పద్మ, వై.అమృత, యువ మోర్చా నేతలు సందీప్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని