Hyderabad News: రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్తో తాజాగా చిన్నారికి వైద్యం
మానవత్వం వెల్లివిరుస్తోంది. చిన్నారుల్లో అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తలో చేయి వేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లికి చెందిన ప్రవీణ్,
అరుదైన వ్యాధి.. ఆదుకుంటున్న మానవత్వం
చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి చిత్రం
ఈనాడు, హైదరాబాద్: మానవత్వం వెల్లివిరుస్తోంది. చిన్నారుల్లో అరుదుగా వచ్చే ప్రాణాంతక వ్యాధి బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తలో చేయి వేసి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని రేగుబల్లికి చెందిన ప్రవీణ్, స్టెల్లా దంపతుల 23 నెలల చిన్నారికి సోకిన ఈ అరుదైన వ్యాధికి దాతల సాయంతో వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ నోవార్టిస్ ఫార్మా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ను ఉచితంగా అందజేసింది. సికింద్రాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందించారు. క్రమంగా కోలుకుంటుండటంతో తాజాగా చిన్నారిని డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపించారు.
నడవలేరు.. తినలేరు
స్పైనల్ మస్కులర్ అట్రోపి-2(ఎస్ఎమ్ఏ)గా వ్యవహరించే ఈ వ్యాధి వల్ల మెదడు కండరాలు క్షీణిస్తాయి. చిన్నప్పుడే బయట పడుతుంది. ఇందులో టైప్ 1, 2 ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మాట్లాడకపోవడం.. నడవక పోవడం.. పడుకొని లేవలేకపోవడం..ఆహారం మింగలేకపోవడం ప్రధాన లక్షణాలు. గతంలో రాజస్థాన్కు చెందిన నూర్ఫాతిమా(6 నెలలు)కు ఈ వ్యాధి సోకింది. తల్లిదండ్రులు క్రౌడ్ఫండింగ్ ద్వారా రూ.40 లక్షల వరకు సేకరించారు. కేంద్రం రూ.6 కోట్ల మేర పన్నులను తగ్గించింది. అప్పటికే చికిత్సలో జాప్యం జరగడంతో చిన్నారి మృతి చెందింది.
ఇంజక్షన్ ఖరీదు రూ.కోట్లలోనే..
ఈ వ్యాధి నుంచి కాపాడాలంటే జోల్జెన్స్మా అనే ఇంజక్షన్ ఇవ్వాలి. అమెరికా లేదా స్విట్జర్లాండ్ నుంచి తెప్పించాలి. పన్నులతో కలిపి ఖరీదు రూ.22 కోట్లు అవుతుంది. మానవీయ కోణంలో దీనిపై ఉన్న ఎక్సైజ్ సుంకం, జీఎస్టీ కలిపి రూ.6 కోట్లను కేంద్రం ఎత్తేసింది. అయినా కొనడం కష్టం కావడంతో కొందరు క్రౌడ్ ఫండింగ్తో నిధులు సేకరిస్తుంటారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్కు చెందిన ఆయాన్స్గుప్తాకి సోకడంతో ఇంపాక్ట్గురు అనే ఆన్లైన్ క్రౌండ్ ఫండింగ్ సంస్థ ద్వారా పిలుపు ఇవ్వగా ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఉదారత చాటి రూ.16 కోట్లపైనే విరాళాలు అందించారు. అమెరికా నుంచి ఇంజక్షన్ తెప్పించి బాలుణ్ని కాపాడారు. నగరం కేంద్రంగా నలుగురు పిల్లలకు ఇలాంటి చికిత్స అందించారు. ప్రస్తుతం మరో చిన్నారి చికిత్సకు సిద్ధమవుతున్నారు.
లక్షణాలు త్వరగా గుర్తించాలి
డా.రమేష్, పీడియాట్రిక్ న్యూరోఫిజీషియన్, రెయిన్బో ఆసుపత్రి
పిల్లలు ఎదిగేప్పుడు కాళ్లు, చేతులు ఆడించలేకపోవడం.. మెడ నిలబెట్టలేకపోవడం లాంటి లక్షణాలుంటే ఈ వ్యాధిగా అనుమానించాలి. మేనరికం, దగ్గరి బంధుత్వం ఉన్న వారి సంతానానికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువ. రెండేళ్లవయసు లోపు చికిత్స అందించాలి. పూర్తిస్థాయిలో కోలుకోవడానికి 3-4 ఏళ్లు పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM