Hyderabad news : కట్టుడు లేక.. కట్టడి చేయలేక
జీడిమెట్ల దగ్గర ఉన్న ఫాక్స్సాగర్ చెరువు అలుగు పొంగి ఉమామహేశ్వర కాలనీతోపాటు అనేక చోట్ల మూడేళ్లుగా ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ 2.7 కిలో మీటర్ల పొడవున రూ.95 కోట్లతో వరద నాలాల విస్తరణ పనులను కొన్ని నెలల కిందట మొదలుపెట్టారు.
జీడిమెట్ల దగ్గర ఉన్న ఫాక్స్సాగర్ చెరువు అలుగు పొంగి ఉమామహేశ్వర కాలనీతోపాటు అనేక చోట్ల మూడేళ్లుగా ముంపునకు గురవుతున్నాయి. ఇక్కడ 2.7 కిలో మీటర్ల పొడవున రూ.95 కోట్లతో వరద నాలాల విస్తరణ పనులను కొన్ని నెలల కిందట మొదలుపెట్టారు. ఈ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. దీంతో ఇటీవల వర్షాలకే ఈ కాలనీలు ముంపు ముంపులోకి వెళ్లిపోయాయి.
కొద్ది రోజులుగా రాజధానిలోని వందల కాలనీల ప్రజలు వర్షం అంటేనే ఉలిక్కిపడుతున్నారు. గంట వ్యవధిలో 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షం దంచికొడుతుండటంతో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎక్కడ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరుతుందోనని వేలాది కుటుంబాలు నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోంది. ముంపుతో ఇబ్బంది పడుతున్న కాలనీలు ఉన్న ప్రాంతాల్లో నాలాల విస్తరణ పనులు పూర్తి చేయని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఇంజినీరింగ్ అధికారులే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వస్తున్నాయి.
గత ఏడాది వర్షాకాలం అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నాలాల నిర్మాణంతోపాటు మరికొన్ని చోట్ల విస్తరణ పనులను మొదలుపెట్టింది. దీనికి రూ.950 కోట్లు కేటాయించింది. బల్దియాతోపాటు సమీప పురపాలక, నగరపాలక సంస్థల్లో ఈ పనులు పూర్తి చేయాల్సి ఉంది. నగర పరిధిలో ఈ విస్తరణకు సంబంధించి 60 పనులను గత వేసవిలో మొదలు పెట్టాల్సి ఉండగా వివిధ కారణాల వల్ల 37 మాత్రమే మొదలయ్యాయి. కొన్ని పనులు ఏడాది కిందటే మొదలైనా కనీసం 20 శాతం కూడా పూర్తవలేదు. ముంపు నివారణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఏడెనిమిది నెలల కింటే ఆదేశించారు. అధికారులు మొత్తం పనులు కాకపోయినా కాలనీలను ముంచెత్తుతున్న ప్రాంతాల్లోనైనా విస్తరణ పూర్తి చేసి ఉంటే సమస్య తీరేదని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ వాస్తవ పరిస్థితి..
* జీడిమెట్ల వెన్నెలగడ్డ చెరువు నుంచి గోదావరి హోమ్స్ మీదుగా కెమికల్ నాలా వరకు 2.7 కిలో మీటర్ల వరద నీటి కాల్వ నిర్మాణం పనులను ఇప్పటి వరకు మొదలే పెట్టలేదు.
* నెక్నాంపూర్ నాలా నుంచి మూసీ వరకు ఉన్న రూ.24 కోట్లతో నాలా విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇవి కూడా నత్తకు నడకలు నేర్పుతున్నాయి.
* నాగిరెడ్డి చెరువు కాప్రా లేక్ మధ్య రూ.41 కోట్లతో చేపట్టిన పనులు వేగంగా జరగడం లేదు. రసూల్పురా మెయిన్ రోడ్డు కరాచీ బేకరీ దగ్గర రూ.10 కోట్లతో చేపట్టిన కల్వర్టు పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్