దంపతుల మాయాజాలం.. తక్కువ ధరకే విమానం టిక్కెట్లు, ఐఫోన్లంటూ..
సగం ధరలకే విమానం టిక్కెట్లు..తక్కువ ధరకే ఐఫోన్లు ఇప్పిస్తామంటూ కర్ణాటకలోని బెల్గాంలో ఉంటున్న కిలాడీ దంపతులు మోసాలకు తెరతీశారు. సామాజిక మాధ్యమాలు, మెట్రో నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్, గోవా, బెంగళూరు, మంగుళూరు,
సుదర్శన్, సుజాత
ఈనాడు, హైదరాబాద్: సగం ధరలకే విమానం టిక్కెట్లు..తక్కువ ధరకే ఐఫోన్లు ఇప్పిస్తామంటూ కర్ణాటకలోని బెల్గాంలో ఉంటున్న కిలాడీ దంపతులు మోసాలకు తెరతీశారు. సామాజిక మాధ్యమాలు, మెట్రో నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీలను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్, గోవా, బెంగళూరు, మంగుళూరు, కోల్కతా, ముంబయి వంటి నగరాలకు టిక్కెట్లు ఇప్పిస్తామంటూ ప్రచారం చేశారు. విమానాశ్రయాల్లోని కస్టమ్స్ విభాగంలో తమకు బంధువులున్నారని, రూ.80వేల ఐ-ఫోన్ 45వేలకే ఇస్తామంటూ నమ్మించారు. కొద్దినెలల్లోనే రూ.లక్షలు వసూలు చేసుకున్నారు. విమానం టిక్కెట్లు పంపాలంటూ హైదరాబాద్కు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు నిలదీయగా మీ దిక్కున్నచోట చెప్పుకోండి అంటూ బెదిరించారు. కిలాడి దంపతులను నమ్మి రూ.20లక్షలు ఇచ్చిన ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు బెల్గాంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితులు హైదరాబాద్లో ఉంటున్నారని బెల్గాం పోలీసులు గుర్తించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారని తెలిసిన ఇతర బాధితులు ఫిర్యాదులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
డ్రీమ్ఫ్లై ఏవియేషన్ పేరుతో..
బెల్గాంలో నివాసముంటున్న సుదర్శన్, సుజాతలు కొన్నేళ్ల నుంచి డ్రీమ్ఫ్లై ఏవియేషన్, హాస్పిటాలిటీ అకాడమీ పేరుతో ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. కార్పొరేటు సంస్థలు, బృందాలకు చిన్న విమానాలను సమకూర్చడం, వేర్వేరు నగరాలకు విమానటిక్కెట్లు, పంచతార హోటళ్లలోనూ వసతి ఏర్పాటు చేసి డబ్బులు తీసుకుంటున్నారు. కొద్దినెలల క్రితం హైదరాబాద్లోని చాణక్య, ఉత్తమ్ తమ వినియోగదారులకు విమాన టిక్కెట్లు, హోటళ్లలో వసతి కల్పించాలంటూ వారిని కోరారు. టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఇస్తానంటూ సుదర్శన్ చెప్పడంతో పదుల సంఖ్యలో టిక్కెట్లు కొన్నారు. అప్పుడు రాయితీలు ఇచ్చారు. అనంతరం రూ.20 లక్షలు డిపాజిట్గా ఉంచాలంటూ సుదర్శన్ కోరడంతో నాలుగు నెలల క్రితం ఇచ్చారు. తర్వాత విమాన టిక్కెట్లు బుక్చేయగా రాయితీ ఇవ్వలేదు. అదేమని ప్రశ్నించగా బదులివ్వలేదు.
ఐ-ఫోన్లు, ఐ-ప్యాడ్లు ఇస్తామంటూ..
ట్రావెల్ ఏజెన్సీల ప్రతినిధులతో సుదర్శన్, సుజాతలు మాట్లాడుతున్నప్పుడు తక్కువ ధరలకే ఐ-ఫోన్లు, ఐ-ప్యాడ్లు ఇస్తామంటూ చెప్పారు. ఒకటి, రెండు ఐ-ఫోన్లు రూ.45వేలు, రూ.55వేలకే ఇచ్చారు. దీంతో చాణక్య స్నేహితులు, సుదర్శన్ వద్ద రాయితీ విమాన టిక్కెట్లు కొన్నవారిలో కొందరు తమకూ ఐ-ఫోన్లు, ఐ-ప్యాడ్లు కావాలంటూ రూ.వేలల్లో డబ్బులు ఇచ్చారు. బాధితుల నుంచి డబ్బు తీసుకున్న సుదర్శన్ వారికి ఫోన్లు, ప్యాడ్లు ఇవ్వలేదు. అడిగితే దాటవేస్తూ వచ్చారు. బెల్గాంలో వారు లేకపోవడంతో బాధితులు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
BRS: దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కలిసిన భారాస నేతలు
[ 18-03-2024]
కాంగ్రెస్లో చేరిన భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని భారాస ఎమ్మెల్యేల బృందం సభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను కలిసింది. -
Tamilisai: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా
[ 18-03-2024]
తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేశారు. -
HYD News: ఫిలింనగర్లో నీటి కుంటలో పడి యువకుడి గల్లంతు
[ 18-03-2024]
గొర్రెలు మేపడానికి వెళ్లిన యువకుడు హకీంపేట కుంటలో గల్లంతైన ఘటన ఫిల్మ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
BRS: కారు దిగుతున్నారు.. గ్రేటర్లో గట్టి షాక్
[ 18-03-2024]
గ్రేటర్లో భారాసకు గట్టి షాక్ తగిలింది. ఒకే రోజు సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యే పార్టీకి గుడ్బై చెప్పారు. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కేసీఆర్ నివాసానికి మంచి నీటి ట్యాంకర్!
[ 18-03-2024]
మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి జలమండలి అధికారులు శనివారం ఉచితంగా ఓ మంచినీటి ట్యాంకర్ పంపారు. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో శనివారం బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి భారాస ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. -
గాయని మంగ్లీకి తప్పిన ప్రమాదం
[ 18-03-2024]
ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొన్న ఘటన శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో చోటు చేసుకుంది. -
నాడు తలా ఒకటి.. నేడు పోటాపోటీ
[ 18-03-2024]
రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో ఓటర్లు ఒక్కో ఎన్నికల్లో ఒక్కోలా స్పందిస్తున్నారు. -
మండుటెండల్లో మబ్బులు
[ 18-03-2024]
వేసవి ముందే వచ్చింది.. ఫిబ్రవరి నెలాఖరులోనే ఎండలు తీవ్రతను చాటాయి. ఇక మార్చి ఆరంభంనుంచే వేసవి తాపం పెరిగిపోయింది. -
నదికి నగిషీలు
[ 18-03-2024]
రాజధాని నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీ నదిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి దాదాపు రూ.50 వేల కోట్ల వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. -
చుక్చుక్ బండి.. చర్లపల్లి సిద్ధమవుతోందండి
[ 18-03-2024]
నగరానికి మణిహారంగా భావిస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిజాముల కాలం నుంచి ఆ మూడు స్టేషన్లేనా అనుకున్న నగరవాసులకు నాలుగోది చర్లపల్లి రైల్వే టర్మినల్ అందుబాటులోకి రానుంది. -
మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం
[ 18-03-2024]
మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపింది. ఓ పాఠశాల ప్రాంగణంలోకి చొరబడి నగదు దోచుకెళ్లారు. -
ప్రాణం తీసిన అతివేగం
[ 18-03-2024]
అతివేగం ఒకరి ప్రాణాల్ని బలి తీసుకుంది. జీడిమెట్ల ఎస్సై సతీశ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ భగత్సింగ్నగర్లో నివాసముండే ముప్పిడి గణేశ్(28) ప్రైవేటు బ్యాంకులో పనిచేసేవారు. -
నీరు నిలవకుండా.. ట్రాఫిక్ ఆగకుండా
[ 18-03-2024]
కుండపోత వానలతో ఏటా నగరంలోని పలు రహదారులు నీట మునుగుతుంటాయి. గంటల తరబడి రాకపోకలు నిలిచిపోతాయి.. అలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. -
ఎన్నికల వేళ.. సైబర్ వల
[ 18-03-2024]
లోక్సభ ఎన్నికల వేళ సర్కారు పథకాల బూచి చూపిస్తూ సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. -
క్వారీ అక్రమాలు రూ.300 కోట్లపైనే..
[ 18-03-2024]
-
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరిట యువతకు కుచ్చు టోపీ
[ 18-03-2024]
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగులను వంచించిన యువకుడి ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. -
ఏఐ డేస్ 2024 సదస్సు 30 నుంచి
[ 18-03-2024]
స్వేచ్ఛా తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) డేస్ 2024 పేరిట ఈనెల 30 నుంచి జేఎన్టీయూలో అతిపెద్ద సదస్సు నిర్వహించనున్నారు. -
మూడేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడి అత్యాచారం
[ 18-03-2024]
మూడేళ్ల చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సరూర్నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పవనపురి కాలనీలో ఓ ఇంట్లో పక్క పక్క పోర్షన్లలో రెండు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. -
విమానాశ్రయంలో యువతి, బాలిక అదృశ్యం
[ 18-03-2024]
అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఓ యువతి, బాలిక అదృశ్యమయ్యారు. ఆర్జీఐఏ పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన యువతి(24), బాలిక(2) కలిసి ఈనెల 14న అమెరికాకు ఇండిగోలో వెళ్లడానికి టికెట్లను బుక్ చేసుకున్నారు. -
అప్రమత్తతే రక్ష
[ 18-03-2024]
వేసవిలో అగ్ని ప్రమాదాలు అధికంగా జరిగే ఆస్కారముంటుందని, తక్షణం స్పందించేలా సర్వసన్నద్ధంగా ఉన్నామని వికారాబాద్ అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకట్ రమణారెడ్డి తెలిపారు. -
ప్రతిపాదనల్లోనే ‘జెనరిక్’
[ 18-03-2024]
మహిళా సాధికారతకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. తాజాగా పొదుపు సంఘాలకు చెందిన మహిళలకు బీమా సదుపాయంతోపాటు పెద్ద ఎత్తున రుణాలు అందించేందుకు శ్రీకారం చుట్టింది. -
పాసుపుస్తకాలున్నాయ్.. భూములేవీ?
[ 18-03-2024]
రెవెన్యూ అధికారుల తప్పిదాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. బ్యాంకులూ నష్టపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
TS News: హోమ్ ఓటింగ్కు ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలి: వికాస్రాజ్
-
సంక్షోభం వేళ నీటి ఆదాకు బెంగళూరు డాక్టర్ ‘4 టిప్స్’.. రోజుకు 600 లీటర్లు సేవ్ చేశారట..!
-
TDP: ‘ప్రజాగళం’ పేరుతో మరిన్ని సభలు.. తెదేపా నిర్ణయం
-
Pakistan: పొరుగు దేశంపై పాక్ వైమానిక దాడి.. ఎనిమిది మంది మృతి
-
Himachal Pradesh: కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై స్టేకు సుప్రీం నిరాకరణ
-
Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు