Hyd News: చావు రహస్యం సమాధి
కడుపునొప్పి తాళలేక గృహిణి బలవన్మరణం.. అమ్మ తిట్టిందని ఆత్మహత్యకు పాల్పడిన బాలిక.. మరుగుదొడ్డిలో నిర్జీవంగా పడి ఉన్న యువతి.. తరచూ ఏదో మూలన మృతికి పోలీసు రికార్డుల్లో కనిపించే కారణాలు. మూడు పోలీసు కమిషనరేట్స్ పరిధిలో ఏటా 100-110 వరకూ అనుమానాస్పద మరణాలు
నగరంలో అంతుచిక్కని అనుమానాస్పద మరణాలు
ఈనాడు, హైదరాబాద్
కడుపునొప్పి తాళలేక గృహిణి బలవన్మరణం.. అమ్మ తిట్టిందని ఆత్మహత్యకు పాల్పడిన బాలిక.. మరుగుదొడ్డిలో నిర్జీవంగా పడి ఉన్న యువతి.. తరచూ ఏదో మూలన మృతికి పోలీసు రికార్డుల్లో కనిపించే కారణాలు. మూడు పోలీసు కమిషనరేట్స్ పరిధిలో ఏటా 100-110 వరకూ అనుమానాస్పద మరణాలు నమోదవుతుంటాయని అంచనా. తమ ఆత్మీయుల చావుల వెనుక వాస్తవాలు కావాలంటూ బాధిత కుటుంబాల్లో కొందరు ఠాణాల చుట్టూ తిరుగుతుంటారు. అధికశాతం తమ తలరాత ఇంతేనంటూ వెనక్కి తగ్గుతున్నారు. వివాహేతర సంబంధాలు, ప్రేమ, సహజీవనం అంశాల్లో ఆత్మహత్యకు పురిగొల్పుతున్న మృగాళ్లు ఆధారాలు దొరక్కుండా వ్యవహరించి తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. బలవన్మరణంగా మొదట కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో లభించిన ఆధారాలతో హత్యలుగా నిర్ధారిస్తున్నారు. ఎవరు చేశారనేది? గుర్తించడంలో తాత్సారం చేస్తున్నారనే విమర్శలున్నాయి.
కేసు దర్యాప్తులో ఉందంటూ..!
పుప్పాలగూడ అపార్ట్మెంట్లో పొరుగు రాష్ట్రానికి చెందిన యువతీ యువకుడు సహజీవనం సాగిస్తున్నారు. ఇద్దరికీ మాదకద్రవ్యాలు తీసుకొనే అలవాటుందంటారు స్నేహితులు. ఒకరోజు యువతి స్నానాల గదిలో అపస్మారకస్థితిలో పడి ఉంది. ఆసుపత్రికి తరలించేలోపు మరణించింది. అతిగా మత్తుపదార్థాలు ఇచ్చారా, తీసుకుందా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. నార్సింగిలో ఓ గృహిణి పడక గదిలో తనువు చాలించింది. ఉద్యోగనిమిత్తం దూర ప్రాంతానికి వెళ్లిన భర్త కూడా మూడ్రోజులు భార్యతో మాట్లాడలేదు. పోలీసులు ఫోన్ చేసేంత వరకూ అతడికి భార్య చనిపోయినట్లు తెలియదంటూ చెప్పుకొచ్చాడని సమాచారం. మల్కాజిగిరి జోన్ పరిధిలో మానసికస్థితి సరిగా లేని కుమారుడు, వయసుమీరిన తల్లి ఉంటున్నారు. ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి అతికష్టమ్మీద లోపలకు ప్రవేశించి వయోధికురాలి మృతదేహాన్ని గుర్తించారు. తల్లి శవం పక్కనే కొడుకు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ఆమె అనారోగ్యంతో మరణించిందా.. ఆత్మహత్య చేసుకుందా అనేది సమాధానం దొరకని ప్రశ్నగా ఉంది. గతేడాది తుర్కయాంజల్లో ఓ భవనంలో లభించిన మొండెం కలకలం సృష్టించింది. సూర్యాపేట జిల్లాకు చెందిన యువకుడిదిగా గుర్తించారు. ఘటన జరిగి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ అది నరబలా! హత్యా అనేది పోలీసులు నిర్ధారించలేకపోయారు. కొన్ని అనుమానాస్పద మరణాలు హత్యలుగా గుర్తించినా నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీసులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాజకీయ, ఆర్ధికబలం ఉపయోగించి కేసులు పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరహా కేసులపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తులో ఉందంటూ.. వాస్తవాలు బయటపడేందుకు సమయం పడుతుందంటూ తప్పించుకోవడం కొసమెరుపు.
ఎక్కడో హత్యలు.. ఇక్కడ శవాలు
ఇటీవల జీడిమెట్ల వద్ద బహళ అంతస్తు భవనంపై నుంచి కిందకు దూకి బాలిక ఆత్మహత్య చేసుకొంది. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఆ తర్వాత అకస్మాత్తుగా కేసు ముగిసింది. ఎల్బీనగర్లో ఇటీవల ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడటం వల్ల బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అంచనా వేశారు. తల్లిదండ్రులు కూడా విషాదంలో ఉండటంతో వారిని ప్రశ్నించేందుకు పోలీసులు ఆచితూచి స్పందిస్తున్నారు. నాలాలు, నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ మృతదేహాలు కనిపిస్తుంటాయి. మృతుల ఆనవాళ్లు లేకుండా కాల్చడం, ముఖాన్ని చెక్కేసి అక్కడ పడేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా మృతుల ఆధారాలు లభించక శవాగారాల్లో భద్రపరుస్తున్నారు. ఆస్తితగాదాలు, వివాహేతర సంబంధాలు, ప్రతీకారంతో చంపేసిన తర్వాత ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంటారని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత