చెరువు.. కనుమరుగు
ఈ చిత్రం చూడండి.. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2016లో.. హైటెక్ సిటీ సమీపంలోని గుట్టలబేగంపేట ప్రాంతం గూగుల్ మ్యాప్లో ఇలా ఉంది. అప్పట్లో అక్కడ ఓ చెరువు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టు ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో చెరువు ఉన్న ప్రాంతంలో పచ్చదనం ఉంది
ఒకప్పుడు తటాకం.. ప్రస్తుతం మాయం
గుట్టల బేగంపేటలో అదృశ్యమైన నీటి వనరు
ఈనాడు, హైదరాబాద్
ఈ చిత్రం చూడండి.. సరిగ్గా ఆరేళ్ల కిందట అంటే 2016లో.. హైటెక్ సిటీ సమీపంలోని గుట్టలబేగంపేట ప్రాంతం గూగుల్ మ్యాప్లో ఇలా ఉంది. అప్పట్లో అక్కడ ఓ చెరువు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చుట్టు ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో చెరువు ఉన్న ప్రాంతంలో పచ్చదనం ఉంది. వర్షాకాలంలో చెరువులోకి నీరు చేరి కొన్ని నెలలపాటు నిల్వ ఉండేదని స్థానికులు చెబుతున్నారు.
ఇది ప్రస్తుతం తీసిన చిత్రం. ఆరేళ్ల తర్వాత అక్కడ చెరువు ఆనవాళ్లు లేకుండా పోయాయి. పచ్చదనం కనుమరుగై నిర్మాణాలు పుట్టుకొస్తున్నాయి. చుట్టు పెద్దఎత్తున నిర్మాణాలు రావడంతో నీరు పారే వరద కాల్వలు కనుమరుగై చెరువు మాయమైన పరిస్థితి. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ ధరణి వెబ్సైట్లో ఇంటి స్థలాల కింద ఉన్నట్లు చేర్చారు.
హైటెక్ నగరంలో మరో నీటి వనరు మాయమైంది. ఆక్రమణలతో చెరువు ఆనవాళ్లు పూర్తిగా కోల్పోయింది. ఆరేళ్లలో రూపురేఖలే లేకుండా పోయి కాలగర్భంలో కలిసిపోయింది. శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలో సర్వే నం.7, 8, 9, 32, 33 సర్వే నంబర్లలో చెరువు విస్తరించి ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. దాదాపు 62 ఎకరాల్లో ఇది విస్తరించి ఉండగా, ప్రస్తుతం సర్వే నం.7, 8, 9, 32లోని 48.06 ఎకరాల్లో నీటి వనరు పూర్తిగా మాయమైంది. 2016 నుంచి మొదలుకుని వరుసగా సేకరించిన గూగుల్ చిత్రాలను పరిగణలోకి తీసుకుంటే చెరువు ఏటా కుంచించుకుపోయిన పరిస్థితి స్పష్టమవుతోంది. ఇప్పుడు ఏకంగా.. ధరణి వెబ్సైట్లో సర్వే నం.7, 8, 9, 32లో ఇంటి స్థలాలున్నట్లు నమోదైంది. చెరువును పునరుద్ధరించకుండా ఏకంగా ఇంటి స్థలాలుగా మార్పు చేయడంపై పర్యావరణవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ప్రాంతం నుంచి అడ్డంగా రహదారి నిర్మాణం సైతం జరిగింది.
వరదకాల్వలు మాయం!
గుట్టలబేగంపేట చెరువులోకి సున్నంచెరువు నుంచి వరద కాల్వలు అనుసంధానంగా ఉండేవి. సున్నంచెరువులో నీరు నిండిన తర్వాత ఇక్కడికి వచ్చి చేరేది. నీటి ప్రవాహానికి పూర్తిగా అడ్డుకట్ట పడింది. వరద కాల్వలు ఆక్రమణకు గురికావడంతో ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో నీరు రాకుండా నిలిచిపోయి గుట్టలబేగంపేట చెరువే మాయమైపోయింది.
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
- లుబ్నా సార్వత్, సామాజిక ఉద్యమకారిణి
చెరువు ఆక్రమణలపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇలా నీటి వనరులు మాయమైతే భవిష్యత్తులో పుస్తకాల్లోనే చదువుకోవాలి. అధికార యంత్రాంగం చెరువును పునరుద్ధరించాలి. ప్రస్తుతం వేసిన రోడ్డు వంతెన రూపంలోకి వచ్చే అవకాశముంది. చెరువు, వరద కాల్వలను పునరుద్ధరిస్తే వరదల నివారణకు ఉపయుక్తంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!