విద్యార్థులు... సైబర్ అంబాసిడర్లు..!
రోజువారీ జీవనంలో చరవాణి ఎంత విస్తృతమైందో మోసాలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా విద్యాసంస్థల్లో భౌతిక తరగతులు నిర్వహించక పోవడంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా అనివార్యంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించాల్సి వచ్చిన విషయం అందరికీ విదితమే.
ఎంపికైన వారికి ముగిసిన శిక్షణ
కార్యాచరణకు సన్నాహాలు
న్యూస్టుడే, వికారాబాద్
శిక్షణ ఇస్తున్న నిర్వాహకులు
రోజువారీ జీవనంలో చరవాణి ఎంత విస్తృతమైందో మోసాలు సైతం అదే స్థాయిలో పెరిగాయి. కరోనా కారణంగా ఏడాదిన్నరకు పైగా విద్యాసంస్థల్లో భౌతిక తరగతులు నిర్వహించక పోవడంతో విద్యార్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా అనివార్యంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించాల్సి వచ్చిన విషయం అందరికీ విదితమే. దీంతో ఆన్లైన్ తరగతులకు ప్రధానంగా చరవాణి, ల్యాప్టాప్, ట్యాబ్, డెస్క్టాప్లను వినియోగించాల్సి వచ్చింది. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటంతో విద్యార్థులు సైబర్ మోసగాళ్ల బారిన పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతేడాది సూర్యాపేట జిల్లా కోదాడలో తండ్రి మొబైల్లో ఓ విద్యార్థి ఆన్లైన్ తరగతులు వింటుండగా, సెల్ఫోన్కు ఓ ఓటీపీ వచ్చింది. సైబర్ మోసగాడు ఫోన్ చేసి అడగ్గా ఆ విద్యార్థి ఓటీపీ సంఖ్య చెప్పిందే తడువుగా అతడి తండ్రి బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. దీంతో పాటు సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ ఆటలతో పిల్లలు వేధింపులకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని గుర్తించిన పోలీస్శాఖ విద్యార్థుల కోసం 10 నెలల క్రితం సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇటీవలే శిక్షణ పూర్తయింది. దీనికి సంబంధించి ‘న్యూస్టుడే’ కథనం.
మోసాల బారిన పడకూడదని..
సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు, వేధింపులు, బెదిరింపులకు పిల్లలు గురి కాకుండా ఉండేందుకు రాష్ట్ర పోలీసుశాఖ, మహిళా భద్రతా విభాగం అధికారులు సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. షీ బృందం, విద్యాశాఖ, యంగిస్థాన్ ఫౌండేషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో భాగంగా తొలుత జిల్లాలోని 50 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన 100 మంది విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేశారు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు, వారికి ఒక ఉపాధ్యాయుడు మెంటర్గా ఉన్నారు. ఇద్దరు విద్యార్థుల్లో 8, 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక, ఒక బాలుడు ఉన్నారు. వీరికి 10 నెలల పాటు ఆన్లైన్లో జరుగుతున్న సైబర్ నేరాలు, మోసాల బారిన పడకుండా వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ ఇచ్చారు.
రక్షిత్ టాండన్ తరగతులు..
జిల్లాలో సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైబర్ నిపుణుడు రక్షిత్ టాండన్ నేతృత్వంలో 10 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్ అంబాసిడర్లుగా ఎంపికైన విద్యార్థులను సైబర్ మోసాలను పసిగట్టడంలో నిష్ణాతులుగా తీర్చి దిద్దారు. ఆన్లైన్ ద్వారా మోసగాళ్లు ఎలా మోసం చేస్తారో వాటిని ఎలా ఎదుర్కోవాలో అవగాహన కల్పించారు. వారం వారం విద్యార్థులు, మెంటర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. పిల్లలు మంచి కోసం ఇంటర్నెట్ను వినియోగించేలా అవగాహన పెంపొందించేందుకు సైబర్ అంబాసిడర్ల ద్వారా కార్యకలాపాలకు రూపకల్పన చేయనున్నారు. పిల్లల సమస్యలను అర్థం చేసుకోవడానికి శిక్షణలో భాగంగా సర్వేను సైతం నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలు ఇంటర్నెట్ను వినియోగించే సమయంలో సురక్షిత వాతావరణం కల్పించేలా అవగాహన కల్పించారు. ఇంటర్నెట్ నిపుణులతో అభిప్రాయాలను పంచుకునేలా సైబర్ అంబాసిడర్లకు శిక్షణ ఇచ్చారు. తొలి దశ శిక్షణ పూర్తి చేసుకున్న వారితో మిగతా విద్యార్థులకు సైతం ఈ సైబర్ అంబాసిడర్లు సైబర్ నేరాలపై అవగాహన కల్పించేలా పోలీసుశాఖ ప్రణాళిక రూపొందించింది.
సమన్వయంగా ముందుకు వెళ్తాం: ఎన్.కోటిరెడ్డి, జిల్లా పోలీసు అధికారి
సైబర్ నేరాలను అరికట్టడానికే సైబర్ కాంగ్రెస్ ప్రాజెక్టును రూపొందించాం. జిల్లాలో ఈ ప్రాజెక్టును వంద మంది విద్యార్థులకు నిపుణులతో శిక్షణ ఇప్పించి విజయవంతంగా పూర్తి చేశాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, మెంటర్లను సుశిక్షితులుగా తీర్చిదిద్ది వారి ద్వారా జిల్లాలో మిగిలిన విద్యార్థులను సైతం సైబర్ అంబాసిడర్లుగా రూపొందించడానికి విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ