logo

సందడిగా షర్మిల పాదయాత్ర

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొడంగల్‌లో మంగళవారం ప్రారంభమై ఆద్యంతం సందడిగా సాగింది. కార్యాకర్తలు, స్థానికులు ఆమెను చూసేందుకు ఉత్సాహం చూపారు. పాదయాత్ర ప్రారంభంలో

Published : 10 Aug 2022 01:13 IST

కొడంగల్‌లో పాదయాత్రగా వెళ్తున్న షర్మిల

కొడంగల్‌, న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొడంగల్‌లో మంగళవారం ప్రారంభమై ఆద్యంతం సందడిగా సాగింది. కార్యాకర్తలు, స్థానికులు ఆమెను చూసేందుకు ఉత్సాహం చూపారు. పాదయాత్ర ప్రారంభంలో బండల ఎల్లమ్మ దేవాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి షర్మిలకు శాలువా కప్పి స్వాగతం పలికారు. బస్టాండ్‌ సమీపంలో వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, షర్మిలతో కూడిన భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.

అభిప్రాయాలు తీసుకునే మారుతా: గురునాథ్‌రెడ్డి
ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మాట్లాడుతూ తాను తెరాస పార్టీ మారే విషయంమై నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు తీసుకొన్న తరువాతే  నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తన వయస్సు 81 సంవత్సరాలని రాజకీయాల్లో కొనసాగేందుకు సహకరించడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైతెపా జిల్లా అధ్యక్షులు తమ్మలి బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని