ఇల్లు వస్తుందా? రాదా?
గ్రేటర్లో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలన అయోమయంగా మారింది. ఔత్సాహికులు 2016లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఆరేళ్ల తర్వాత దరఖాస్తుదారులకు ఫోన్ చేస్తున్నారు. కొందరు
7.5 లక్షల దరఖాస్తుదారుల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్లో రెండు పడక గదుల ఇళ్ల దరఖాస్తుల పరిశీలన అయోమయంగా మారింది. ఔత్సాహికులు 2016లో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఆరేళ్ల తర్వాత దరఖాస్తుదారులకు ఫోన్ చేస్తున్నారు. కొందరు సిబ్బంది ఆరు రకాల వివరాలు అడుగుతుండగా, మరికొందరు మీరెక్కడున్నారనే ప్రశ్నతో సరిపెడుతున్నారు. చిరునామా తీసుకుని ఫోన్ పెట్టేస్తున్నారు. దాంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన మొదలైంది. తమకు ఇల్లు వచ్చినట్టా, రానట్టా అని తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ఆఫీసులకు పయనమవుతున్నారు. మరోవైపు.. ఫోన్ నెంబరు సరిగా లేని దరఖాస్తుదారులు, వేరే ప్రాంతానికి నివాసం మార్చుకున్న వారు, ఓటరు గుర్తింపుకార్డు లేని వారు గగ్గోలు పెడుతున్నారు. ఇంటి దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలేంటో ప్రకటించకుండా జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడమే ఆయా సమస్యలకు తావిస్తోంది.
మమ్మల్నీ పరిగణనలోకి తీసుకోండి.. పేదలకు ఇళ్లు అనగానే కలెక్టర్ కార్యాలయాల్లో, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులిచ్చారు. నాలుగేళ్ల క్రితం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు ప్రక్రియ నిలిచింది. అధికారులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇలా 3 జిల్లాల నుంచి 10 లక్షల దరఖాస్తులందాయి. 7.5 లక్షలను ప్రభుత్వం జీహెచ్ఎంసీకి ఇచ్చింది. పరిశీలించి కలెక్టర్ల సాయంతో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించింది. కానీ కలెక్టర్ కార్యాలయాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన వెబ్సైట్ ద్వారా చేసుకున్న దరఖాస్తులు జీహెచ్ఎంసీకి అందలేదు. ఆ రెండు పద్ధతుల్లో అర్జీ పెట్టుకున్న పేదలు లబోదిబోమంటున్నారు.
జవాబుల్లేని ప్రశ్నలు.. 7.5 లక్షల దరఖాస్తులను 30 సర్కిళ్ల ఉపకమిషనర్లకు పంపారు. ఆస్తిపన్ను, ఇతరత్రా విభాగాల సిబ్బంది వాటిని యాప్ సాయంతో పరిశీలిస్తున్నారు. పౌరులకు ఫోన్ చేసి 6 రకాల వివరాలు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు, అర్హత ఏంటి, కేటాయింపు ఎలా, కలెక్టర్ కార్యాలయాల్లో ఇచ్చిన దరఖాస్తుల సంగతేంటి, ఇల్లు మారిన దరఖాస్తుదారులను ఎలా విచారిస్తారు, ఫోన్ నెంబరు మారితే ఎలా గుర్తిస్తారు, గ్రామాల్లో ఓటరు గుర్తింపు కార్డు కలిగి నగరంలో ఇల్లు కావాలంటూ వచ్చిన దరఖాస్తులను ఏం చేస్తారు.. వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానాల్లేవు.
అసంబద్ధ విభజన..
నగరంలోని పేదలకు 1లక్ష ఇళ్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. జీహెచ్ఎంసీ అధికారులు నియోజకవర్గానికి 4వేల చొప్పున మొత్తం 24 నియోజకవర్గాలకు సమానంగా ఇళ్లు కేటాయిస్తామంటున్నారు. కానీ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో పేదలు అద్దె ఇల్లు తీసుకుని నివాసం ఉంటున్నారు. దాని వల్ల కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, తదితర నియోజకవర్గాల నుంచి పెద్దయెత్తున దరఖాస్తులు అందాయి. ఉదాహరణకు.. కూకట్పల్లి నియోజకవర్గం నుంచి ఇళ్ల కోసం 50వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. ప్రధాన నగరంలోని ఓ నియోజకవర్గంలో ఆ సంఖ్య పది వేలు. అందువల్ల నగరం మొత్తాన్ని యూనిట్గా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయాలనే వాదన వినిపిస్తోంది.
నగరంలో నిర్మించతలపెట్టిన ఇళ్లు: లక్ష
ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి: 65 వేలు
తుది దశలో ఉన్నవి: 20 వేలు
పనులు ఇటీవల మొదలైనవి: 10 వేలు
ప్రారంభోత్సవం జరిగినవి: 5 వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.