నగదు చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్
స్నేహితుడి ఇంటికి వచ్చి నగదుతో ఉడాయించిన ఇద్దరిని మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కస్పరాజు శ్రీనివాస్ వివరాల ప్రకారం.. గతనెల 30న స్థిరాస్తి వ్యాపారి
సైదాబాద్, న్యూస్టుడే: స్నేహితుడి ఇంటికి వచ్చి నగదుతో ఉడాయించిన ఇద్దరిని మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ కస్పరాజు శ్రీనివాస్ వివరాల ప్రకారం.. గతనెల 30న స్థిరాస్తి వ్యాపారి ఎ.సాయిప్రకాష్రెడ్డి ఆహ్వానంతో ఇంటికి నల్గొండకు చెందిన నలపరాజు రాజేష్ (31), మిత్రుడు మెసుల ప్రవీణ్కుమార్ (28) వచ్చారు. మద్యం తాగి రూ.75 లక్షల నగదు బ్యాగుతో ఉడాయించారు. పోలీసులు ప్రవీణ్ను ఈనెల 5న అదుపులో తీసుకుని రూ.66,50,000 నగదు, 8న రాజేష్ను పట్టుకొని రూ.8,30,000 స్వాధీనం చేసుకున్నారు. రాజేష్ నల్గొండ టూటౌన్ ఠాణాలో రౌడీషీటర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం