logo

నగదు చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్‌

స్నేహితుడి ఇంటికి వచ్చి నగదుతో ఉడాయించిన ఇద్దరిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కస్పరాజు శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. గతనెల 30న స్థిరాస్తి వ్యాపారి

Published : 10 Aug 2022 02:45 IST

సైదాబాద్‌, న్యూస్‌టుడే: స్నేహితుడి ఇంటికి వచ్చి నగదుతో ఉడాయించిన ఇద్దరిని మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కస్పరాజు శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. గతనెల 30న స్థిరాస్తి వ్యాపారి ఎ.సాయిప్రకాష్‌రెడ్డి ఆహ్వానంతో ఇంటికి నల్గొండకు చెందిన నలపరాజు రాజేష్‌ (31), మిత్రుడు మెసుల ప్రవీణ్‌కుమార్‌ (28) వచ్చారు. మద్యం తాగి రూ.75 లక్షల నగదు బ్యాగుతో ఉడాయించారు. పోలీసులు ప్రవీణ్‌ను ఈనెల 5న అదుపులో తీసుకుని రూ.66,50,000 నగదు, 8న రాజేష్‌ను పట్టుకొని రూ.8,30,000 స్వాధీనం చేసుకున్నారు. రాజేష్‌ నల్గొండ టూటౌన్‌ ఠాణాలో రౌడీషీటర్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని