logo

కోమాలో బాధితుడు..ఫాంహౌస్‌లో నిందితులు!

క్యాబ్‌ కిరాయి అడిగిన పాపానికి ఉప్పర్‌పల్లిలో దాడికి గురైన వెంకటేష్‌ పరిస్థితి విషమంగానే ఉంది. మంచి వైద్యం అందించడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని

Published : 10 Aug 2022 02:45 IST

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: క్యాబ్‌ కిరాయి అడిగిన పాపానికి ఉప్పర్‌పల్లిలో దాడికి గురైన వెంకటేష్‌ పరిస్థితి విషమంగానే ఉంది. మంచి వైద్యం అందించడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని కుటుంబ సభ్యులు ‘ఈనాడు’ ముందు కంటతడిపెట్టుకున్నారు. దాడి ఘటనలో ఇప్పటికే వివేక్‌రెడ్డి కోర్టులో లొంగిపోయిన సంగతి తెలిసిందే. అతడిని కస్టడీలోకి తీసుకున్న తరువాత 12మంది నిందితుల పేర్లు పోలీసులకు చెప్పాడు. ఆ విషయం నిందితులకు తెలియడంతో దొరక్కుండా తిరుగుతున్నట్లు తెలుస్తోంది. నిందితుల్లో పలువురు మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నట్లు సమాచారం. వారిని కేసు నుంచి తప్పించేందుకు కొంతమంది నాయకులు, ప్రజాప్రతినిధులు  పోలీసులకు ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.  కాగా ఉప్పర్‌పల్లి దాడి ఘటనలో నిందితులందరినీ అరెస్టు చేస్తామని రాజేంద్రనగర్‌ సీఐ నాగేంద్రబాబు తెలిపారు. నిందితుల గురించి వేట కొనసాగుతోందన్నారు.ఎంత ఒత్తిడిచేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని