Hyderabad news :విమాన టికెట్లతో పోటీ పడుతున్న క్యాబ్ ఛార్జీలు
నగరంలో క్యాబ్ ఛార్జీలను చూస్తే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. విమానాశ్రయానికి వెళ్లాలంటే రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. అక్కడి నుంచి రావాలన్నా తిప్పలు తప్పట్లేదు. రైడ్ బుకింగ్ అయ్యేందుకు 20 నిమిషాలకు మించి సమయం పడుతుంటే.. బుక్ అయిన తర్వాత రద్దు చేయమంటూ సదరు డ్రైవర్లు చెప్పి
ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన దండుకుంటున్న వైనం
చినుకు పడితే బుకింగ్కు తిప్పలు
ఈనాడు, హైదరాబాద్: నగరంలో క్యాబ్ ఛార్జీలను చూస్తే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. విమానాశ్రయానికి వెళ్లాలంటే రూ. వేలల్లో చెల్లించాల్సి వస్తోంది. అక్కడి నుంచి రావాలన్నా తిప్పలు తప్పట్లేదు. రైడ్ బుకింగ్ అయ్యేందుకు 20 నిమిషాలకు మించి సమయం పడుతుంటే.. బుక్ అయిన తర్వాత రద్దు చేయమంటూ సదరు డ్రైవర్లు చెప్పి నగదు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో సమయానికి చేరుకోవాలనే తొందరలో.. మరో రైడ్ బుక్ చేయలేక డ్రైవర్లు చెప్పినట్లు నడుచుకుంటున్నారు. కొత్తగా నగరానికొచ్చేవారి నిస్సహాయతను గమనించి.. మరికొందరు డ్రైవర్లు అధిక మొత్తం వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇళ్లకు చేరుకునేందుకూ సొంత వాహనాలు లేక రైడ్లు బుక్ చేసుకుంటే అవీ అకారణంగా రద్దవుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. స్పందించే, సమీక్షించే వ్యవస్థ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* కొండాపూర్కు చెందిన గోకుల్రాజ్ అనే వ్యక్తి విమానాశ్రయం వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేశారు. క్యాబ్ ఛార్జి రూ.2,100 చూసి ముక్కున వేలేసుకున్నాడు. చెన్నై-హైదరాబాద్ ఫస్ట్క్లాస్ ట్రైన్ టిక్కెట్ ధర రూ.2,500 ఉంటే, క్యాబ్లో కొండాపూర్ నుంచి విమానాశ్రయం వెళ్లేందుకు ఇంత ఛార్జీ ఏంటంటూ అసహనం వ్యక్తం చేశాడు.
* గుంజన్ కశ్యప్ అనే వ్యక్తి సికింద్రాబాద్ నుంచి విమానాశ్రయం చేరుకునేందుకు క్యాబ్ బుక్ చేశారు. ఛార్జీ రూ.800 కాగా, ఆ రైడ్ను రద్దు చేయమంటూ డ్రైవర్ చెప్పడంతో.. ఊరికి కొత్త కావడంతో రైడ్ను రద్దు చేశానని, తీరా విమానాశ్రయం వెళ్లాక రూ.1200 కావాలంటూ డిమాండ్ చేశాడంటూ క్యాబ్ సంస్థకు ఫిర్యాదు చేశారు.
వానొస్తే అంతే...
వర్షం పడిన సమయంలో, ఆఫీసు సమయాలు, రద్దీ వేళల్లో ఆయా క్యాబ్ సంస్థలు ఆల్గారిథమ్ లెక్కలతో సర్జ్, పీక్ అవర్స్ను నిర్దేశిస్తూ మూడు నుంచి నాలుగు రెట్లు వసూలు చేస్తున్నాయి. సర్జ్, పీక్ లెక్కలతో ప్రయాణికులకు ‘వాహనాలు అందుబాటులో ఉన్నా బుక్ అవకపోవడం..అంటే కొన్నిసార్లు ఎదురుగా క్యాబ్ ఖాళీగా కనిపిస్తున్నా.. బుక్ కాకపోవడం...చాలా ఆలస్యంగా బుక్ అయితే రెండు నుంచి మూడు రెట్లు ఛార్జీలు వేయడం’ వంటివి ఉత్పన్నమవుతున్నాయి.
* నగరంలోని సందర్శనీయ ప్రాంతాల్లోనూ నగరవాసులు రైడ్ బుకింగ్కు ఇబ్బందులు పడుతున్నారు. నెక్లెస్రోడ్లోని జలవిహార్, టాంక్బండ్ సమీపంలోని లుంబినీ పార్కుకు వెళ్లేందుకు సులువుగా క్యాబ్ బుక్ అవుతుంటే..అక్కడి నుంచి తిరుగు ప్రయాణానికి రైడ్ బుక్ అవడం లేదు.
రోజూ పదివేల క్యాబ్లు
విమానాశ్రయం నుంచి నిత్యం 5వేల క్యాబ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటికి గంటకు రూ.250 చొప్పున పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత గంటకు రూ.50 చొప్పున, 24గంటలకు రూ.600 వరకు తీసుకుంటున్నారు. దీనికితోడు కంపెనీల పరంగా బుకింగ్ జరిగితే డ్రైవర్ రైడ్ ఛార్జీల్లో 25శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. పెట్రోల్ భారంగా మారడంతో, యాప్తో రైడ్ బుక్చేస్తే చాలామంది డ్రైవర్లు తిరస్కరిస్తున్నారని క్యాబ్ డ్రైవర్ల సంఘాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల