logo

కారు అద్దం పగలకొట్టి... రూ. 4 లక్షల సొత్తు చోరీ

కారు అద్దం పగులకొట్టి రూ. 3.5లక్షల  నగదు, ల్యాప్‌టాప్‌ ఎత్తుకెళ్లారు. మలక్‌పేట సీఐ శ్రీనివాస్‌  వివరాల మేరకు.. సైదాబాద్‌ డివిజన్‌ ఏపీఏయూ కాలనీకి చెందిన కె.మతేశ్‌రెడ్డి (64)  సోమవారం

Published : 10 Aug 2022 02:45 IST

సైదాబాద్‌:  కారు అద్దం పగులకొట్టి రూ. 3.5లక్షల  నగదు, ల్యాప్‌టాప్‌ ఎత్తుకెళ్లారు. మలక్‌పేట సీఐ శ్రీనివాస్‌  వివరాల మేరకు.. సైదాబాద్‌ డివిజన్‌ ఏపీఏయూ కాలనీకి చెందిన కె.మతేశ్‌రెడ్డి (64)  సోమవారం రాత్రి హిమాయత్‌నగర్‌ నుంచి కారులో కుమారుడు వివేక్‌రెడ్డితో కలిసి ఇంటికి వస్తున్నారు. మూసారాంబాగ్‌లోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఎదుట కారు నిలిపి లోపలికి వెళ్లారు. తిరిగి బయటకు వచ్చేసరికి కారు వెనుక కుడివైపు అద్దం పగిలి ఉంది. కారులోని రూ. 3.5 లక్షల నగదు ఉన్న బ్రీఫ్‌కేస్‌, ల్యాప్‌టాప్‌ కనిపించలేదు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని