logo

టోలిచౌక్‌లో విషాదఛాయలు

నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టోలిచౌకి అరుణాకాలనీకి చెందిన మిన్హాజ్‌బేగం(38) ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

Published : 11 Aug 2022 03:22 IST


క్రేన్‌తో కారును తొలగిస్తున్న పోలీసులు

గోల్కొండ, న్యూస్‌టుడే: నిజామాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన టోలిచౌకి అరుణాకాలనీకి చెందిన మిన్హాజ్‌బేగం(38) ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో ఆమెతో పాటు కుమారులు సయ్యద్‌ అఖిల్‌ అహ్మద్‌(7), సయ్యద్‌ ఫిన్జా హమ్నానీ(3 నెలలు) మృతి చెందడం స్థానికులను కలచివేసింది. అంతకుముందు తమ సోదరుడు మహ్మద్‌ అంజద్‌షేక్‌తో కలిసి మహారాష్ట్రకు వెళ్తున్నామని చెప్పిన మిన్హాజ్‌ విగతజీవిగా మారడంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని