logo

మత్తుకు బానిసై.. భార్య తలపై మూత్రం

మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన భర్త వేధింపులు ఎక్కువయ్యాయని, నా తలపై మూత్రవిసర్జన చేశారని ఓ మహిళ బెంగళూరు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితురాలు తెలంగాణకు చెందిన ఓ దుస్తుల దుకాణం యజమాని కుమార్తె అని పోలీసులు వెల్లడించారు.

Published : 11 Aug 2022 03:15 IST

బెంగళూరు, న్యూస్‌టుడే: మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన భర్త వేధింపులు ఎక్కువయ్యాయని, నా తలపై మూత్రవిసర్జన చేశారని ఓ మహిళ బెంగళూరు బసవనగుడి పోలీసులకు ఫిర్యాదుచేశారు. బాధితురాలు తెలంగాణకు చెందిన ఓ దుస్తుల దుకాణం యజమాని కుమార్తె అని పోలీసులు వెల్లడించారు. సందీప్‌ అనే వ్యక్తితో ఆమెకు జనవరిలో హైదరాబాద్‌లో పెళ్లి జరిగింది. కట్నం కింద 4కిలోల బంగారు నగలు, కారు ఇచ్చారు. తెలంగాణలోని రెండు దుస్తుల దుకాణాలను సందీప్‌ పేరిట రాసిచ్చారు. బెంగళూరులో ఉంటున్న సందీప్‌ మాదక ద్రవ్యాలకు అలవాటుపడి.. స్నేహితులను ఇంటికే రప్పించి పార్టీలు చేసుకునేవాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె అడ్డుకున్న ప్రతిసారీ దాడిచేసి, అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు వాపోయారు. మాదకద్రవ్యాల మత్తులో తనతో గొడవపడి తలపై మూత్ర విసర్జన చేశాడంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు బుధవారం వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని