logo

ప్రేమ పేరుతో మోసం.. తల్లయిన యువతి

పెళ్లి చేసుకుంటా నంటూ మాయ మాటలతో యువతి(20)ని ఓ యువకుడు లొంగదీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. రేపు మాపు అంటూ కాలయాపన చేశాడు.

Published : 11 Aug 2022 03:15 IST

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటా నంటూ మాయ మాటలతో యువతి(20)ని ఓ యువకుడు లొంగదీసుకున్నాడు. ఆమె గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. రేపు మాపు అంటూ కాలయాపన చేశాడు. రోజులు గడవడంతో ఆ యువతి ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన శంషాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. స్థానికంగా ఉండే మహిళకు పదిహేనేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. దినసరి కూలి పని చేస్తూ ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని చదివించింది. పెద్ద కుమార్తె వివాహం చేయగా చిన్న కుమార్తె(20) ఏడాది నుంచి విమానాశ్రయంలోని ఓ హోటల్‌లో పారిశుద్ధ్య విభాగంలో పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న ఆమనగల్‌కు చెందిన మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడు. గర్భవతి కావడం.. నెలలు నిండే సమయం సమీపించడంతో పరారయ్యాడు. కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని