logo

చదువుతోనే అభివృద్ధి

విద్యతోనే అభివృద్ధి సాధ్యమని సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ బండారు సుబ్బారావు అన్నారు. బుధవారం రాత్రి కాచిగూడ వైశ్యాహాస్టల్‌ ట్రస్ట్‌బోర్డు వ్యవస్థాపక ఛైర్మన్‌, స్వాతంత్య్ర సమరయోధుడు...

Updated : 11 Aug 2022 04:05 IST


విద్యార్థికి పుస్తకాలు అందజేస్తున్న బండారు సుబ్బారావు, బాస్తర్‌గుప్తా తదితరులువిద్యా

కాచిగూడ, న్యూస్‌టుడే: విద్యతోనే అభివృద్ధి సాధ్యమని సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ బండారు సుబ్బారావు అన్నారు. బుధవారం రాత్రి కాచిగూడ వైశ్యాహాస్టల్‌ ట్రస్ట్‌బోర్డు వ్యవస్థాపక ఛైర్మన్‌, స్వాతంత్య్ర సమరయోధుడు కొత్తురు సీతయ్యగుప్త జయంతి సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రాతపుస్తకాలను ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్‌ సూర్యప్రకాశ్‌రావు, కార్యదర్శి భాస్కర్‌గుప్త, హాస్టల్‌ కమిటీ అధ్యక్షుడు మధుతో కలిసి ఆయన పంపిణీ చేశారు. సేవలో ఆర్యవైశ్యలు ముందంజలో ఉన్నారని కొనియాడారు. ప్రముఖులు రాజేశ్వర్‌, రవిప్రసన్నకుమార్‌, నగేశ్‌, జయప్రకాశ్‌రామ్‌, జయరాములుగుప్త, మల్లికార్జున్‌, అనంతనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు