logo

బ్యూటీపార్లర్‌ పెట్టిస్తానని.. రెండేళ్లుగా అత్యాచారం

ఓ యువతికి బ్యూటీ పార్లర్‌ పెట్టిస్తానని నమ్మించి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో బుధవారం వెలుగు చూసింది. షాద్‌నగర్‌కి చెందిన యువతి (29) బ్యూటీషియన్‌.

Updated : 12 Aug 2022 04:41 IST

జీడిమెట్ల, న్యూస్‌టుడే: ఓ యువతికి బ్యూటీ పార్లర్‌ పెట్టిస్తానని నమ్మించి రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన జీడిమెట్ల ఠాణా పరిధిలో బుధవారం వెలుగు చూసింది. షాద్‌నగర్‌కి చెందిన యువతి (29) బ్యూటీషియన్‌. డిప్లొమా చేసే సమయంలో రమేశ్‌ అనే స్నేహితుడి ద్వారా సంజీవరెడ్డి పరిచయమయ్యాడు. కోర్సు పూర్తయిన తర్వాత యువతికి బ్యూటీపార్లర్‌ పెట్టుకునేందుకు సాయం చేస్తానని నమ్మించి దగ్గరయ్యాడు. 2020లో సికింద్రాబాద్‌లో ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో ఉంచాడు. అన్నీ చూసుకుంటానని చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. యువతిని గది నుంచి బయటకు రానివ్వకపోగా బ్యూటీపార్లర్‌నూ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకొని గాజులరామారంలోని ఓ అపార్టుమెంట్‌లో ఉంటోంది. బుధవారం ఆమె పుట్టినరోజు కావడంతో చిరునామా తెలుసుకొని ఫ్లాట్‌కి వచ్చాడు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని బలవంతంగా తాగించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని తీరుతో విసిగిపోయిన యువతి అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ పవన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని