గుంతలమయం.. పట్టు తప్పితే ప్రమాదం
అసలే జిల్లా రోడ్లు అంతంత మాత్రం. ఏడాదికి పైగా మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీనికి తోడు నిధుల కొరత. ఇలాంటి సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు.. ఫలితంగా వాటి రూపురేఖలే మారిపోయాయి.
వర్షాలకు 100 కి.మీపైగా దెబ్బతిన్న రోడ్లు
రూ.9కోట్లతో మరమ్మతులకు ప్రతిపాదనలు
న్యూస్టుడే, పరిగి : అసలే జిల్లా రోడ్లు అంతంత మాత్రం. ఏడాదికి పైగా మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్నాయి. దీనికి తోడు నిధుల కొరత. ఇలాంటి సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు.. ఫలితంగా వాటి రూపురేఖలే మారిపోయాయి. అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు అడుగులోతు గుంతలుగా మారాయి. ఏ మాత్రం ఆదమరిచినా ప్రాణం మీదకు వచ్చినట్లే... ఎక్కడో ఓచోట నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాహన చోదకులు బిక్కుబిక్కుమూంటూ నడపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
నిధులు ఇస్తేనే...
జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలున్నాయి. వీటిలో ప్రధానంగా పరిగి, కొడంగల్, వికారాబాద్ పరిధిలో రోడ్లు, భవనాల శాఖ ఆధీనంలో ఉండగా సుమాఉ 400 కిలోమీటర్ల మేరకు రోడ్ల పొడవు ఉంది. ఒక్క పరిగి, కొడంగల్ నియోజకవర్గంలోనే సుమారు 40 కిలోమీటర్ల దూరం వరకు వర్షాలకు పాడయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 432 రోడ్లు ఉండగా సుమారు 961కిలోమీటర్ల దూరం రోడ్లు ఉన్నాయి. వీటిలో 60 కిలోమీటర్ల మేరకు బాగు చేయాల్సి ఉంది. ఇలాంటి సయయంలో తగినన్ని నిధులు విడుదల చేసి ఇబ్బందులు తీర్చాలని కోరుతున్నారు. ఒక్క కుల్కచర్ల మండలంలోనే 20 పీఆర్ రోడ్లు 42కి.మీ పాడైంది.
తక్కువ ఎత్తు కావడంతో..
పరిగి - వికారాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారిపై పరిగి సమీపాన వాగు ఉంది. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఇది ప్రస్తుతం చాలా వరకు పాడైంది. రోడ్డు కంటే చాలా తక్కువ ఎత్తులో ఉండటంతో చిన్నపాటి వర్షం కురిసినా వరద ఉద్ధృతికి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. ఇటీవల వర్షాలకు రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొంది.
* బషీరాబాద్, పెద్దేముల్ మండలాల పరిధిలోని రోడ్లు పూర్తిగా రూపురేఖలు మారిపోయాయి.
* పరిగి -నస్కల్ గ్రామాల మధ్య వంతెన వద్ద అప్రోచ్రోడ్డు గుంతల మయంగా మారింది.
* వికారాబాద్ మండల పరిధి గ్రామాల్లో గుంతలతో ప్రజలు నానా పాట్లు పడుతున్నారు.
* కుల్కచర్ల మండలం అంతారం సమీపం నుంచి గాధిర్యాల్ వరకు అప్రోచ్రోడ్డు పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. పుట్టపాహడ్ గ్రామం వద్ద రోడ్డు చిన్నపాటి కుంటను తలపిస్తోంది.
* పరిగి -షాద్నగర్ రోడ్డులో పరిగి సమీపం నుంచి తొండపల్లి వరకు తారు రోడ్డు పనికి రాకుండా పోయింది. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలు పోయే విధంగా ఉన్నాయి. రెండు నెలల క్రితం తొండపల్లి సమీపాన గుంతలను తప్పించబోయి భార్య మృతి చెందడంతో భర్తకు గాయాలయ్యాయి. ఇదే రోడ్డులో సయ్యద్ మల్కాపూర్ వద్ద గురువారం ఓ లారీ డ్రైవర్ గుంతలను తప్పించబోయి కారును ఢీకొంది. తృటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు.
* పరిగి నుంచి లఖ్నాపూర్ ఆరు కిలోమీటర్ల రోడ్డు అద్వానంగా మారింది. నర్సయ్యగూడ రోడ్డు దారుణంగా మారింది. పరిగి నుంచి కాళ్లాపూర్ వరకు ఐదు కిలోమీటర్ల దూరం కూడా రోడ్డు చాలా ప్రాంతాల్లో గుంతలు పడింది.
* పూడూరు మండలం చన్గోముల్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న నాలుగు కిలోమీటర్ల దూరం వర్షాలకు గుంతలుగా తయారయ్యాయి.
* గట్టుపల్లి నుంచి నిజాంపేట్ మేడిపల్లి గేట్ వరకు 2.8కి.మీ మరమ్మతు పనులు చేపట్టాలి.
* కొడంగల్ నుంచి ఉడుమేశ్వరం, ఎరన్పల్లి వరకు ఆరు కిలోమీటర్ల మేర, హస్నాబాద్ వరకు దాదాపు 8కి.మీ. అన్నిచోట్లా గుంతలు పడ్డాయి.
ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం
- సుదర్శన్రెడ్డి, ఉమేష్కుమార్, సురేందర్, డీఈఈలు, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ
దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వానికి రూ.9 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. పరిగి సమీపాన వాగుపై వంతెన నిర్మాణానికి గతంలోనే రూ.5కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్