logo

భారత స్వతంత్ర వజ్రోత్సవాలు.. నగరవాసులకు హెచ్ఎండీఏ ఆఫర్

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరవాసులకు హెచ్ఎండీఏ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న నగరంలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని పార్కుల్లో ఉచితంగా ప్రవేశించేలా

Published : 12 Aug 2022 14:54 IST

హైదరాబాద్‌: భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నగరవాసులకు హెచ్ఎండీఏ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న నగరంలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని పార్కుల్లో ఉచితంగా ప్రవేశించేలా ఏర్పాట్లు చేసింది. సాధారణ రోజుల్లో అయితే ఉద్యానవనాల్లో ప్రవేశం కోసం టికెట్‌కు డబ్బులు వసూలు చేస్తారు. 75 వసంతాల స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకొని 15వ తేదీ ఒక్కరోజు నగరవాసులు, పర్యాటకులకు ఉచిత సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. నగరంలోని లుంబిని పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, లేక్ వ్యూ పార్కు, మెల్కొటే పార్కు, ప్రియదర్శిని పార్కు, రాజీవ్ గాంధీ పార్కు, పటేల్ కుంట పార్కు, లంగర్ హౌస్‌ పార్కు, చిన్నతాళ్లకుంట పార్కులో ఉచిత ప్రవేశాన్ని కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని