డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్టు
నగరంలో నిషేధిత మత్తు పదార్థం (ఎండీఎంఏ) విక్రయిస్తున్న నైజీరియన్ను నారాయణగూడ పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 3 లక్షల విలువ
30 గ్రాముల ఎండీఎంఏ, సెల్ఫోన్లు, విదేశీ కరెన్సీ స్వాధీనం
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, సెల్ఫోన్లు, నగదు
నారాయణగూడ, న్యూస్టుడే: నగరంలో నిషేధిత మత్తు పదార్థం (ఎండీఎంఏ) విక్రయిస్తున్న నైజీరియన్ను నారాయణగూడ పోలీసులతో కలిసి హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ) పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి సుమారు 3 లక్షల విలువ చేసే 30 గ్రాముల మత్తు పదార్థం (ఎండీఎంఏ), నాలుగు సెల్ఫోన్లు, ఖతార్, కెమెన్ ఐల్యాండ్స్ తదితర దేశాలతో పాటు భారత్కు చెందిన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడ ఠాణాలో శుక్రవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన వివరాలను అబిడ్స్ ఏసీపీ వెంకట్రెడ్డి, నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఇన్స్పెక్టర్ పి.రమేశ్రెడ్డి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్రెడ్డి, డీఐ రవికుమార్, హెచ్-న్యూ ఎస్సై సి.వెంకటరాములుతో కలిసి మధ్యమండలం డీసీపీ రాజేష్చంద్ర వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓసీగ్వేచుక్వెంక జేమ్స్ అలియాస్ అలామంజో మిసిచుక్వా (37) భారత్లో అక్రమంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. గోవా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని హైదరాబాద్కు తీసుకొచ్చి అమ్ముతున్నాడు. జేమ్స్ తొలుత 2013లో ఇండియాకు వచ్చి వెళ్లాడు. 2016, 2019లలోనూ వచ్చి తిరిగి వెళ్లిపోయాడు. 2021లో మళ్లీ వచ్చి గోవాలో ఉంటూ డ్రగ్స్ అక్రమరవాణా చేస్తూ 2022 మార్చిలో అక్కడి పోలీసులకు చిక్కాడు. అప్పట్లో అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మూడు నెలల పాటు జైలు ఉండి విడుదలైన జేమ్స్ తర్వాత ‘అలామంజో మిసిచుక్వాగా’ మార్చుకొని, నకిలీ ధ్రువపత్రాలతో పాస్పోర్టులు సృష్టించి అక్కడే మకాం వేశాడు. నైజీరియాలో ఉండే అతని స్నేహితుడు జాక్తో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నాడు.
108 మందితో వాట్సాప్ గ్రూప్: నిందితుడు జేమ్స్ 108 మంది వినియోగదారులతో వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసుకున్నాడు. అవసరమైనవారికి ఎండీఎంఏ డ్రగ్ గ్రాము రూ.7 వేల చొప్పున విక్రయిస్తున్నాడు. ఇది నీళ్లలో కలిపి తాగవచ్ఛు లేదా ముక్కుతో పీలుస్తారని డీసీపీ చెప్పారు. ఈ మత్తు పదార్థం 10 గ్రాములకు మించి ఉంటే అది వ్యాపారమే అవుతుందన్నారు. ఇటీవల మళ్లీ నగరంలో డ్రగ్స్ క్రయవిక్రయాలు సాగుతున్నట్లు సమాచారం అందడంతో హెచ్-న్యూ బృందం అదనపు డీసీపీ స్నేహ, ఇన్స్పెక్టర్ రమేష్ గట్టి నిఘా పెట్టిందని, కింగ్కోఠి నియాజ్ఖానా వద్ద డ్రగ్స్తో ఓ వ్యక్తి ఉన్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నారాయణగూడ పోలీసుల సహకారంతో మాటువేసి జేమ్స్ను పట్టుకున్నట్లు తెలిపారు. అతడి వాట్సాప్ జాబితాలో ఉన్న వినియోగదారుల్లో ఇప్పటికే 63 మంది చిరునామాలను గుర్తించామని, మిగతా వారి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వినియోగదారుల్లో ఇంజినీర్లు, విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, కొందరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయని అన్నారు. ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? అనేది విచారించి నిగ్గుతేలుస్తామన్నారు. మత్తు పదార్థాలు అమ్మినవారితో పాటు వినియోగించినవారూ దోషులే అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అరెస్ట్
[ 17-04-2024]
మాదాపూర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. -
కేసీఆర్, రేవంత్ డూప్ ఫైట్ చేస్తున్నారు: లక్ష్మణ్
[ 17-04-2024]
హామీలు నేరవేర్చనందుకు కాంగ్రెస్ నేతలు ప్రజల ఆగ్రహం చవిచూస్తున్నారని భాజపా రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. -
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
[ 17-04-2024]
తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
జువెనైల్ హోం నుంచి తప్పించుకున్న పిల్లలు
[ 17-04-2024]
బాచుపల్లి జువైనల్ హోం నుంచి మంగళవారం కొంత మంది పిల్లలు తప్పించుకుని పారిపోయారు. జువైనల్ హోంలో మొత్తం 32 మంది పిల్లలు ఉన్నారు. -
సొంత బావని చంపిన బామ్మర్ది
[ 17-04-2024]
చేవెళ్ల మండల కేంద్రంలో కడమంచి నారాయణదాసు (45) అనే వ్యక్తిని హత్య చేశాడు. -
ప్రయాణికులు ఫుల్.. ఎంఎంటీఎస్లు నిల్
[ 17-04-2024]
ఒకప్పుడు 1.20 లక్షల మంది ప్రయాణికులున్న ఎంఎంటీఎస్ ఇప్పుడు 40 వేలకే పరిమితమైంది. గతంలో 45 కిలోమీటర్లు 120 సర్వీసులు ఉండగా.. ఇప్పుడు రెండోదశ అందుబాటులోకి వచ్చాక 145 కిలోమీటర్లకు పరుగులు పెరిగినా.. కేవలం వందలోపు సర్వీసులతో సరిపెడుతున్నారు. -
కంటోన్మెంట్ పోరు.. అభ్యర్థులు ఖరారు
[ 17-04-2024]
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. -
నాడు.. నేడు.. సాగరే ఆధారం
[ 17-04-2024]
నగరానికి తాగునీటి సమస్య లేకుండా జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తరలించడానికి ప్రణాళిక చేపడుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ వద్ద అత్యవసర పంపింగ్ స్టేషన్ నిర్మాణం షురూ చేసింది. -
నాడు అనుచరులు.. నేడు ప్రత్యర్థులు
[ 17-04-2024]
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ ఇద్దరూ ఒకప్పుడు పీజేఆర్ అనుచరులు. ప్రస్తుత నగర పరిధిలో ఎమ్మెల్యేలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి తలపడుతున్నారు. -
తప్పని గురి.. విజయతీరం చేరి
[ 17-04-2024]
సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం.. విభిన్నమైన ఆలోచనా విధానం.. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్వైపు అడుగులేశారు. -
మూడు ప్రమాదాలు.. 8 మంది మృతి
[ 17-04-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఆశ్రయమిచ్చిన ఇంటి¸నే దోచిన బాలిక
[ 17-04-2024]
ఇన్స్టాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసింది. చిలకలగూడ ఠాణాలో మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ ఆర్.గిరిధర్ వివరాలు వెల్లడించారు. -
రకుల్ తళుకుల్
[ 17-04-2024]
సినీనటి రకుల్ ప్రీత్సింగ్ మంగళవారం మాదాపూర్లో సందడి చేశారు. ఓ చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. -
రైల్వేస్టేషన్లలో మురుగు నీటి రీసైక్లింగ్..
[ 17-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ఉద్యానాలు ఎండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం నీరు తగినంత లేకపోవడమేనని సమాధానం వస్తుంది. -
అలలపై సాహసం.. అలుపెరగని పోరాటం
[ 17-04-2024]
‘అమ్మా నేను హుస్సేన్సాగర్లో సెయిలింగ్ నేర్చుకుంటానని కుమార్తె అడిగినప్పుడు.. తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూనే కాదనలేకపోయారు. -
మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
[ 17-04-2024]
మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది. -
మత్తు తలకెక్కి.. చదువు అటకెక్కించి..
[ 17-04-2024]
వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా నివసిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న మొరాకో దేశస్థుడు హెచ్న్యూ పోలీసులకు చిక్కాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ నిందితుడు.. డ్రగ్స్ పెడ్లర్లతో స్నేహం చేస్తున్నాడు. -
నిఘా పెట్టి.. ఆచూకీ కనిపెట్టి
[ 17-04-2024]
నలుగురు యువకులు ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జీడిమెట్ల నేరవిభాగం ఇన్స్పెక్టర్ విజయ్నాయక్ ప్రత్యేక నిఘా పెట్టి వారిని కటకటాల్లోకి పంపించారు. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
[ 17-04-2024]
నాటకరంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. -
ఏఐడీఎంకేను గెలిపించండి: అసదుద్దీన్
[ 17-04-2024]
దేశంలో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని.. అందుకు తమిళనాడులో పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నానని హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
ఒవైసీకి ఓటెందుకెయ్యాలో చెప్పాలి: రాజాసింగ్
[ 17-04-2024]
తమను చంపాలని చూస్తున్నారన్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. -
రూ.28 లక్షలు స్వాధీనం
[ 17-04-2024]
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు తనిఖీల్లో రూ.28,22,000 నగదు, రూ.2,37,702 విలువైన ఇతర వస్తువులు, 69.03 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. -
సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు
[ 17-04-2024]
‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు. -
జిల్లా సహాయ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
[ 17-04-2024]
వికారాబాద్ జిల్లా నూతన సహాయ కలెక్టర్గా ఉమా హారతి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. -
గనుల వ్యర్థాలు.. ఆదాయ నిక్షేపాలు
[ 17-04-2024]
జిల్లాలోని నాపరాళ్ల వ్యర్థాలను సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తే గనుల శాఖకు రూ.కోట్ల కొద్ది ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా కుప్పలు పేరుకుపోయాయి.
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్