logo

ఉగ్రవాద, అవినీతి వ్యతిరేక ర్యాలీ 15న

రాష్ట్రవ్యాప్తంగా యువజన సంఘాలను సమీకరించి ఈ నెల 15న లిబర్టీ నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ భాగ్యనగర్‌ గోశాల వరకు ఉగ్రవాద, అవినీతి వ్యతిరేక ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలంగాణ యువ మైత్రి సంఘ్‌ అధ్యక్షుడు, ర్యాలీ

Published : 13 Aug 2022 02:04 IST

గోడపత్రికను ఆవిష్కరిస్తున్న అశోక్‌గాంధీ

గోల్నాక, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా యువజన సంఘాలను సమీకరించి ఈ నెల 15న లిబర్టీ నుంచి లోయర్‌ ట్యాంక్‌బండ్‌ భాగ్యనగర్‌ గోశాల వరకు ఉగ్రవాద, అవినీతి వ్యతిరేక ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలంగాణ యువ మైత్రి సంఘ్‌ అధ్యక్షుడు, ర్యాలీ సమన్వయకర్త అశోక్‌గాంధీ తెలిపారు. శుక్రవారం చప్పల్‌బజార్‌లో ర్యాలీకి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదరికం, కుల, మత విద్వేషాలు నిర్మూలిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దేశ పునర్నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలన్నారు. ప్రతినిధులు సాక్షి, ప్రొఫెసర్‌ లలితానరేన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని