logo

బీదర్‌ ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

ఉత్తర కర్ణాటకలోని బీదర్‌ జిల్లా హొన్నికేరి క్రాస్‌ వద్ద శుక్రవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాల్కి నుంచి బీదర్‌కు వెళుతున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సు- తెలంగాణ నుంచి

Published : 13 Aug 2022 02:02 IST

ప్రమాద స్థలంలో కారు, బస్సు

బీదర్‌, న్యూస్‌టుడే: ఉత్తర కర్ణాటకలోని బీదర్‌ జిల్లా హొన్నికేరి క్రాస్‌ వద్ద శుక్రవారం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాల్కి నుంచి బీదర్‌కు వెళుతున్న కేఎస్‌ఆర్‌టీసీ బస్సు- తెలంగాణ నుంచి మహారాష్ట్రలోని ఉదగీరకు వెళుతున్న కారును ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వారిని బీదర్‌లోని బ్రిమ్స్‌ వైద్యశాలలో చేర్పించారు. జనవాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని