భవనం ఇక్కడ.. బోధన అక్కడ..!
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలకు అన్నిహంగులతో భవనం నిర్మించారు. ఆరు నెలలు గడిచినా అందుబాట్లోకి తేవడం విస్మరించారు. మరోవైపు గురుకులాన్ని పొరుగు జిల్లాలో కొనసాగిస్తున్నారు. అసౌకర్యాలతో ఉన్న అద్దె భవనంలో
రూ.4.97 కోట్లతో నిర్మాణం
వృథాగా గిరిజన బాలికల గురుకుల పాఠశాల
న్యూస్టుడే, తాండూరు గ్రామీణ
నిరుపయోగంగా భవనం
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గురుకుల పాఠశాలకు అన్నిహంగులతో భవనం నిర్మించారు. ఆరు నెలలు గడిచినా అందుబాట్లోకి తేవడం విస్మరించారు. మరోవైపు గురుకులాన్ని పొరుగు జిల్లాలో కొనసాగిస్తున్నారు. అసౌకర్యాలతో ఉన్న అద్దె భవనంలో వందలాది మంది విద్యార్థినులకు అవస్థలు తప్పడం లేదు. స్థానికంగా భవనాన్ని వినియోగంలోకి తెస్తే విద్యార్థులు, తల్లిదండ్రులకు సౌకర్యంగా మారుతుందని పలువురు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘న్యూస్టుడే’ కథనం.
నాలుగు అంతస్థుల్లో...
తాండూరు నియోజకవర్గానికి సంబంధించి గిరిజన గురుకుల పాఠశాల భవనానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.4.20కోట్లు మంజూరు చేశాయి. వీటితో 2018లో పనులు మొదలయ్యాయి. నాలుగు అంతస్థుల్లో వందల మంది విద్యార్థినుల వసతికి, బోధనకు, భోజనానికి అనువుగా విశాలమైన భవనాన్ని నిర్మించారు. రంగులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ విద్యా సంవత్సరం జూన్లో కొత్త భవనంలో పాఠాలు ప్రారంభిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు భావించారు. విద్యా సంవత్సరం ఆరంభమై రెండు నెలలు గడిచినా ఊసెత్తకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
వంద కిలో మీటర్లు వెళ్లాలి
మరోవైపు గురుకుల పాఠశాలను రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో మూతపడిన ఓ ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో నిర్వహిస్తున్నారు. భవనంలో ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్ తరగతుల్లోని 600మందికిపైగా విద్యార్థినుల బోధన, వసతికి అనువైన సదుపాయాలు లేకపోవడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెలవు దినాల్లో పిల్లల్ని కలిసేందుకు, పండగపూట ఇళ్లకు తీసుకొచ్చేందుకు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలతోపాటు పట్టణంలోని తల్లిదండ్రులు పొరుగు జిల్లాలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలకు వెళ్లాలంటే వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. రానుపోను 200కిలోమీటర్ల ప్రయాణం, దాదాపు రూ.500ల రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతోపాటుతో ఒకరోజు సమయం పడుతోంది.
పరిగి, కొడంగల నియోజకవర్గాల్లో సొంత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి తాండూరు-చించోళి అంతర్ రాష్ట్ర రహదారికి సమీపంలో జిన్గుర్తి వద్ద రెండు ఎకరాల్లో నిర్మించిన భవనంలో గురుకుల పాఠశాలను కొనసాగిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఎమ్మెల్యే, పాలనాధికారిణి చొరవతో..
గురుకుల పాఠశాల భవన నిర్మాణం పూర్తయ్యాక ప్రహరీ నిర్మింపజేయాలని గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధులు, పాఠశాల అధ్యాపక బృందం తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డిని కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే రూ.77లక్షల డీఎమ్ఎఫ్టీ నిధులు కేటాయించారు. ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు మే 15న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పనులు తుది దశకు చేరాయి. విద్యుత్ కనెక్షన్ నిమిత్తం నియంత్రిక ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంతో జిల్లా పాలనాధికారిణి నిఖిల వెంటనే ట్రాన్స్కో అధికారులను ఆదేశించడంతో విద్యుత్ శాఖ అధికారులు నియంత్రికను అమర్చడంతో విద్యుత్ సరఫరా నాలుగురోజుల క్రితం ప్రారంభమైంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిదుల చొరవతో అన్నిసదుపాయాల్ని సమకూర్చినందున పక్క జిల్లాలోని అద్దె భవనంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను నూతన భవనంలోకి తరలించాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
రూ.77లక్షల డీఎమ్ఎఫ్టీ నిధులతో ఎమ్మెల్యే ఆవిష్కరించిన శిలాఫలకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
[ 19-04-2024]
నగర శివారులో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శ్రీశైలం జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!