logo

‘మహిళ చెర నుంచి కుమారుడిని కాపాడండి’

ఓ మహిళ వలలో చిక్కుకున్న తన కుమారుడిని కాపాడాలంటూ బాధిత తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(ఎస్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలికి చెందిన బాబురావు ప్రైవేటు కళాశాలలో

Published : 13 Aug 2022 02:02 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ఓ మహిళ వలలో చిక్కుకున్న తన కుమారుడిని కాపాడాలంటూ బాధిత తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(ఎస్‌హెచ్‌ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలికి చెందిన బాబురావు ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడు. అతని ఇద్దరు కుమారుల్లో ఒకరు (19) ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్థానికంగా ఉండే ఓ మహిళ (30) ప్రేమపేరుతో తన కుమారుడిని లొంగదీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌ 26న ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు ఇప్పటికీ తమ వద్దకు రాలేదని వాపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ అబ్బాయి మేజర్‌ కాబట్టి తామేమీ చేయలేమని చెబుతున్నట్లు వివరించారు. తమ కుమారుడిని తమకు అప్పగించాలని కమిషన్‌ ముందు కన్నీరుపెట్టుకున్నారు. ప్రస్తుతం కేసు పరిశీలనలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని