logo

అనుమానాస్పద స్థితిలో కార్మికురాలి మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన పంజాగుట్ట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌ సమీపంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన

Published : 13 Aug 2022 02:02 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన పంజాగుట్ట ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్‌ సమీపంలోని భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన కానుకుంటల లక్ష్మి(45) జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలు. 10 రోజులుగా ఎల్లారెడ్డిగూడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటోంది. శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో లక్ష్మి ఇంటి ఆవరణలో మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమె చెంపలపై గాయాలున్నట్లు గుర్తించారు. కూతురు లత అక్కడికి వచ్చి తన తల్లి చెవి కమ్మలు, గొలుసు కనిపించడం లేదని వివరించింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని