పుట్టెడు దుఃఖంలోనూ.. పునర్జన్మ!
పట్టుమని 12 ఏళ్ల వయసు దాటలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్డెడ్గా వైద్యులు గుర్తించారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకొని అవయవాలు
అవయవదానానికి ముందుకొస్తున్న కుటుంబాలు
ఒక్కరి త్యాగంతో 8మంది జీవితాల్లో వెలుగులు
జీవన్దాన్ ట్రస్టుకు 10 ఏళ్లు పూర్తి
ఈనాడు, హైదరాబాద్: పట్టుమని 12 ఏళ్ల వయసు దాటలేదు. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ బాలుడిని మృత్యువు కబళించింది. తీవ్రంగా గాయపడటంతో బ్రెయిన్డెడ్గా వైద్యులు గుర్తించారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు దుఃఖాన్ని దిగమింగుకొని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. బాలుడి నుంచి సేకరించిన అవయవాలతో వైద్యులు 8 మంది జీవితాలను కాపాడారు. ఇటీవలి హైదరాబాద్లో ఈ సంఘటన జరిగింది. ఇది ఉదాహరణ మాత్రమే. ఇలా ఎంతోమంది పెద్ద మనసుతో ముందుకొచ్చి తమ వారి అవయవాలను దానం చేసి అభాగ్యులను ఆదుకుంటున్నారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా దాని ప్రాముఖ్యం తెలుసుకుందాం...
పదివేల మందికిపైగా ఎదురుచూపులు..
ప్రస్తుతం అవయవాల కోసం ప్రభుత్వ కార్యక్రమైన జీవన్దాన్ వద్ద మొత్తం 10916 మంది రిజిస్ట్రేషన్ చేసుకొని ఎదురు చూస్తున్నారు. మూత్రపిండాల కోసం 5424 మంది, కాలేయం కోసం మరో 4931 మంది నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవన్దాన్ ట్రస్టు ఏర్పాటై 10 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు 1087 మంది 4132 అవయవాలను దానం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రస్తుతం విజయవంతంగా ఈ తరహా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అందులోనూ హైదరాబాద్ ముందుంటోంది. ఇటీవల నిమ్స్, ఉస్మానియాలో జరుగుతున్న అవయవ మార్పిడిలే ఇందుకు ఉదాహరణ. మరోవైపు జీవన్దాన్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఏ ఆసుపత్రిలో బ్రెయిన్డెడ్ అయితే ఆ ఆసుపత్రికి గుండె, కాలేయం, ఒక కిడ్నీ ఇవ్వాలి. మిగతావి బయట ఆసుపత్రికి పంపుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్రెయిన్డెడ్ అయినా అవయవదానానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం లేదు. నిరక్షరాస్యత కారణంగా వారిలో చైతన్యం కొరవడుతోంది. ఉస్మానియా, గాంధీలో నెలకు 10-15 బ్రెయిన్డెడ్ కేసులు నమోదు అవుతున్నా సరే ఇందులో అవయవాలు దానం చేసేందుకు 1 శాతం కూడా ముందుకు రావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితిలో కొంత మార్పు వస్తోంది.
జిల్లాలకు విస్తరించేందుకు ప్రణాళిక - డాక్టర్ స్వర్ణలత, కోఆర్డినేటర్, జీవన్దాన్ ట్రస్టు
అవయవదానంపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. జిల్లాల్లో సైతం ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇందుకు నిపుణులైన వైద్యులు, మౌలిక వసతులు అవసరం ఉంది. ట్రస్టు ఏర్పాటు చేసే నాటితో పోల్చితే చైతన్యం పెరిగింది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇంకా మనవద్ద చాలా తక్కువ మందే ముందుకు వస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నాం.
చిన్న గాటుతోనే అవయవాలు సేకరిస్తారు.. - మంగాదేవి, ఆర్గాన్ డొనేషన్ కౌన్సిలర్, కిమ్స్
అవయవదానం అంటే చాలామందికి అపోహ ఉంటుంది. భౌతికకాయం యథావిధిగా అప్పగిస్తారా.. లేదా..అని సందేహిస్తుంటారు. అందుకే బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి కుటుంబ సభ్యులను తొలుత కౌన్సిలింగ్ చేస్తాం. కేవలం ఛాతి కింద ఒక చిన్న కోత పెట్టి అన్ని అవయవాలు సేకరిస్తారు. శరీరంపై ఇంకా ఎక్కడ ఎలాంటి కోతలు ఉండవు. వారికి ధ్రువీకరణ పత్రం కూడా అందిస్తారు. అంతిమ సంస్కారాలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 28-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
రోడ్డు ప్రమాదంలో రైతు మృతి
[ 28-03-2024]
మనవరాలిని చూసేందుకు నగరానికి వచ్చిన తాతయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన సంఘటన కుషాయిగూడ రాణా పరిధిలో జరిగింది. -
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
[ 28-03-2024]
భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే), ఆయన కుమార్తె.. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరనున్నారు. -
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
[ 28-03-2024]
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
[ 28-03-2024]
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
[ 28-03-2024]
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్న నీతా అంబానీ
[ 28-03-2024]
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ ఆలయంలో అమ్మవారిని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ బుధవారం రాత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
ఏడు పదుల వయసులో ఎంత కష్టం!
[ 28-03-2024]
ఏడు పదుల వయసులో తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వృద్ధుడు రెండు రోజుల్లో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. -
నగదుంటేనే రైడ్ రైట్
[ 28-03-2024]
ఉదయం, సాయంత్రం వేళల్లో క్యాబ్ బుక్ అవడం ఓ ప్రహసనమే. అనేక ప్రయత్నాల తర్వాత గానీ బుక్ అవదు. ఒకవేళ అయ్యి పేమెంట్ విధానం ఎంపిక చేసినా.. డబ్బులు ఎలా చెల్లిస్తారంటూ క్యాబ్ డ్రైవర్లు ఫోన్ చేస్తారు. -
సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెన్షన్
[ 28-03-2024]
సీఆర్పీఎఫ్ రికార్డు అసిస్టెంట్ (కానిస్టేబుల్)తో పాటు ఆమె భర్తపై జరిగిన దాడికేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారంటూ పాతబస్తీ బండ్లగూడ పోలీసుస్టేషన్ అధికారులపై నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కొరడా ఝళిపించారు. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
[ 28-03-2024]
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
అదిరే ఆరంభం.. మురిసె అభిమానం
[ 28-03-2024]
ధనాధన్ ఆటకు పేరొందింది ఐపీఎల్ టోర్నీ. అందుకు తగినట్టుగానే నగరంలోని ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, మంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ ఆద్యంతం క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. -
అన్నీ కలిపి.. ఒక్కటే!
[ 28-03-2024]
రానున్న 30ఏళ్ల కోసం పక్కా మాస్టర్ప్లాన్ తయారీకి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్రెడ్డి సూచనల మేరకు 2050 మాస్టర్ప్లాన్కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి రావడంతో శాంతిభద్రతల విఘాతానికి దారితీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
‘లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధిస్తాం’
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో రెండంకెల సీట్లను సాధించిన సత్తా చాటుతామని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్, భారాస పార్టీలు రెండూ ఒక్కటేనని.. -
జకాత్ జరూర్
[ 28-03-2024]
రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ప్రేమను పంచాలని, ఆర్థిక, అసమానతలు తొలగించి, పొరుగువారికి సాయపడాలని ఇస్లాం మూలసిద్ధాంతాలు చెబుతున్నాయి. -
‘డిజిటల్ బ్యాంకింగ్’తో ఆర్థిక లావాదేవీలు సులభం
[ 28-03-2024]
డిజిటల్ బ్యాంకింగ్ విధానంతో ఆర్థిక లావాదేవీలతోపాటు పెట్టుబడులు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మరింత సులభతరమవుతుందని వక్తలు పేర్కొన్నారు. -
‘సేవ్ లద్దాఖ్’కు సంఘీభావం
[ 28-03-2024]
సేవ్ లద్దాఖ్ పేరిట అక్కడి ప్రజలు చేపట్టిన పోరాటానికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘం సంఘీభావం ప్రకటించింది. -
గుడిమల్కాపూర్లో రవీనా టాండన్ సందడి
[ 28-03-2024]
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గుడిమల్కాపూర్లో సందడి చేశారు. -
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి
[ 28-03-2024]
యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని సామాజిక సేవ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో ముందుండాలని లోక్సత్తా వ్యవస్థాపకుడు డా.జయప్రకాశ్నారాయణ సూచించారు. -
గుండెకు అరుదైన శస్త్ర చికిత్స
[ 28-03-2024]
దేశంలోనే మొదటిసారిగా తమ ఆసుపత్రిలో మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ చేసినట్లు పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఎంఎంఎస్ ముఖర్జీ తెలిపారు. -
నైపుణ్యం ఉంటే.. కొలువు వెంటే
[ 28-03-2024]
ఇంజినీర్లు, పట్టభద్రులు ఉద్యోగావకాశాల కోసం వెదుకుతుంటే.. మరో వైపు ప్రతిభావంతులైన నిపుణుల కోసం కార్పొరేట్, స్టార్టప్లు వెదుకుతున్నాయని పలువురు వక్తలన్నారు. -
అనుమతి లేని ఆసుపత్రుల మూసివేత
[ 28-03-2024]
మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం చిలుకానగర్లో ఆకస్మిక తనిఖీలు చేసి అనుమతి లేని వైద్యశాలలను సీజ్ చేశారు. -
హరిత లక్ష్యం.. కార్యాచరణకు సమాయత్తం
[ 28-03-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచడంతోపాటు, పల్లెల్లో పచ్చందాల వృద్ధికి ప్రభుత్వం 9 సంవత్సరాలుగా ‘హరిత హారం’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. -
రూ.లక్షలు వెచ్చించి.. మూలకు చేర్చి!
[ 28-03-2024]
మున్సిపాలిటీల్లో రోడ్లు శుభ్రం చేసేందుకు అధికారులు రూ.లక్షలు పోసి యంత్రాలను కొనుగోలు చేస్తున్నారు. కానీ వాటిని రకరకాల కారణాలు చెబుతూ మూలకు చేరుస్తున్నారు. -
కలెక్టరేట్లో 24 గంటల సహాయ కేంద్రం
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం అవుతుంది. ఇందుకోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. -
టీఎస్ ఈఏపీసెట్ సెంటర్లు పెంచే యోచన: జేఎన్టీయూ
[ 28-03-2024]
టీఎస్ ఈఏపీసెట్-24 పరీక్షా కేంద్రాలను పెంచే యోచనలో జేఎన్టీయూ అధికారులు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా ఇంజినీరింగ్కు 1,93,468 దరఖాస్తులు రాగా.. -
సెల్ఫోన్ చోరీల ముఠా అరెస్టు
[ 28-03-2024]
ఆటోలో తిరుగుతూ ఒంటరిగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని సెల్ఫోన్లు అపహరించుకుపోతున్న ముఠాను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. -
సాంకేతిక లోపంతో ఆగిన మెట్రో
[ 28-03-2024]
సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్లో బుధవారం ఉదయం 15 నిమిషాలపాటు మెట్రోరైలు ఆగింది. -
ఎన్నికల ఫిర్యాదులకు 24 గంటల టోల్ఫ్రీ నంబర్
[ 28-03-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబరు 1800 425 2050కు సమాచారం ఇవ్వొచ్చని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. -
ముందుకు సాగని నకిలీ సీఐడీ అధికారుల కేసు
[ 28-03-2024]
నకిలీ సీఐడీ అధికారులమంటూ ఓ ఐటీ సంస్థ కార్యాలయంపై దాడి చేసిన ముఠాకు సహకారం అందించిన కీలక నిందితుడు, వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఎస్ఐ ఇంకా పరారీలోనే ఉన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ