logo

పార్లమెంటులో గోసంరక్షణ బిల్లు పెట్టాలి

పార్లమెంటులో గోసంరక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలంగాణ గోశాలల సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహేశ్‌ అగర్వాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ హిందీ జర్నలిస్టుల సంఘం

Published : 13 Aug 2022 02:02 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: పార్లమెంటులో గోసంరక్షణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని తెలంగాణ గోశాలల సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మహేశ్‌ అగర్వాల్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ హిందీ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్‌చంద్‌ మునోత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కాచిగూడ చౌరస్తాలో వీర్‌ సావర్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాచిగూడ కార్పొరేటర్‌ ఉమారాణి, రమేశ్‌యాదవ్, సంఘం ప్రధాన కార్యదర్శి భరత్‌భట్, రితీశ్‌ జాగిర్దార్, రాజుగుప్త, శివ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని