Komatireddy venkatreddy: కాంగ్రెస్లో కోమటిరెడ్డి కాక.. అసలు ఆయన మనసులో ఏముంది?
తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి...
ఇంటర్నెట్డెస్క్: తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీ ఎంపీ, టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యవహారంతో ఆ పార్టీలో జరుగుతున్న రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. మునుగోడు మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసిన నేపథ్యంలో చండూరులో నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీలో చిచ్చు రేపాయి. సీనియర్ నేత, ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డిపై పరుష పదజాలంతో చేసిన కామెంట్స్ ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు’ అన్న చందంగా ఆ పార్టీలో కొత్త వివాదానికి కారణమయ్యాయి. ఆ సభకు అధ్యక్షత వహించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలంటూ కోమటిరెడ్డి డిమాండ్ చేయడం.. రేవంత్ కూడా ఎక్కడా పంతాలు, పట్టింపులకు పోకుండా సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేయడం జరిగిపోయాయి. అయినప్పటికీ ఈ వివాదం అక్కడితో చల్లారలేదు.
చిచ్చురేపిన పీసీసీ అధ్యక్ష పదవి..
ఎన్నాళ్ల నుంచో కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉన్నారు. అలాంటిది కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను ఎందుకు వీడారు? పార్టీకి రాజీనామా చేయడానికి ముందు నుంచే పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు ఎందుకున్నారు? అంటే దానికి కారణాలూ లేకపోలేదు. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పీసీసీ అధ్యక్షుడి మార్పు. ఉత్తమ్కుమార్రెడ్డి తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఎవరుంటారనే దానిపై చాలా చర్చలు నడిచాయి. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తెచ్చి అధికారంలోకి తీసుకొచ్చేందుకు సరైన నాయకుడు ఎవరనేదానిపై కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా అభిప్రాయాలనూ సేకరించింది. ఈ క్రమంలో తెరపైకి ఎందరో వచ్చినా ప్రధానంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్రెడ్డి పేర్లపైనే చర్చ జరిగింది. ఈ ఇద్దరిలో ఎవరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనేదానిపై అభిప్రాయాలు సేకరించిన అధిష్ఠానం.. చివరికి రేవంత్ వైపు మొగ్గు చూపి ఆయన పేరును ప్రకటించింది. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎలా? అంటూ కొంతమంది సీనియర్లు బహిరంగంగానే తమ అసహనాన్ని వెళ్లగక్కారు. అయినా పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం కాబట్టి గౌరవిస్తామంటూ బయటకు చెప్పుకొచ్చారు. కానీ లోలోపల రేవంత్కు వ్యతిరేకంగా కొంతమంది అసమ్మతి స్వరం వినిపించడం మొదలుపెట్టారు. జగ్గారెడ్డిలాంటి నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు. రేవంత్కు ప్రాధాన్యమిస్తూ ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను ఎలా విస్మరిస్తారంటూ అంతర్గతంగానూ పలువురు నేతలు చర్చించుకున్నారు. అప్పటి నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎప్పుడో ఆయన కాంగ్రెస్ను వీడతారని ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలకు భాజపా ప్రోత్సాహం తోడవడంతో రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి కమలం గూటికి వెళ్తున్నట్లు ప్రకటించారు.
ప్రచారంపై ఆసక్తి చూపని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
రాజగోపాల్రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన నేపథ్యంలో కొద్ది నెలల్లో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఎలాగైనా తమ స్థానాన్ని నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి నుంచే అక్కడ ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ఉప ఎన్నికకు వారిని సమాయత్తం చేస్తోంది. అయితే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం, ఇతర బాధ్యతల్లో భాగమయ్యేందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆసక్తి చూపడం లేదు. పార్టీని రాజగోపాల్రెడ్డి వీడిన తర్వాత చండూరులో నిర్వహించిన సభకు తనకు కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం.. అదే సభలో అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై వెంకట్రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే సభకు సమాచారం ఇవ్వకపోతే ఎలా? అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఒకే రోజు కేంద్రహోంమంత్రి అమిత్షాను కోమటిరెడ్డి సోదరులు వేర్వేరుగా కలిశారు. వరద నష్టం నిధులు అందించాలని కోరేందుకే ఆయన్ను కలిసినట్లు వెంకట్రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ను వీడేది లేదని చెబుతున్నా.. భాజపాలో చేరేందుకు వెంకట్రెడ్డి సిద్ధమవుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
ఉన్న నాలుకకు మందేస్తే..
‘ఉన్న నాలుకకు మందేస్తే.. కొండ నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో చండూరులో కాంగ్రెస్ సభ ఏర్పాటు చేస్తే.. అక్కడ అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కొత్త వివాదానికి కారణమయ్యాయి. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఉద్దేశిస్తూ ‘ఉంటే ఉండు.. లేకపోతే వెళ్లిపో..’ అనే క్రమంలో ఓ పరుష పదాన్ని అద్దంకి దయాకర్ వాడారు. ఆ వ్యాఖ్యలపై రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పినా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శాంతించేలా కనిపించడం లేదు. ఆయన్ను పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. దయాకర్ను పార్టీ నుంచి బహిష్కరిస్తేనే రేవంత్ క్షమాపణపై ఆలోచిస్తానంటూ మీడియాతో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొనడం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. పార్టీలో పట్టు నిలబెట్టుకునేందుకే అలా అన్నారా? కోరుకున్నట్లే అద్దంకి దయాకర్ను శాశ్వతంగా బహిష్కరిస్తే పార్టీలో కొనసాగుతారా? అదే జరిగితే కోమటిరెడ్డి మునుపటిలా పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తూ మునుగోడు ఉప ఎన్నికలో అన్నీ తానై కాంగ్రెస్ను ముందుండి నడిపిస్తారా? లేకపోతే సోదరుడి బాటలోనే పార్టీ మారేందుకు జరిపే ప్రయత్నాల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారా? అసలు వెంకట్రెడ్డి మనసులో ఏముంది? ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి! వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్పనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్