logo

అనాథగా పెరిగాడు..దొంగగా మారాడు..

అనాథాశ్రమంలో పెరిగాడు. తర్వాత మద్యం, జల్సాలకు అలవాటుపడి దొంగగా మారిన ఇతడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...మన్సూరాబాద్‌లో కేబీఆర్‌ ఫంక్షన్‌ హాలు సమీపంలో ఉంటున్న హరిప్రసాద్‌(22) మునగనూర్‌లోని అనాథాశ్రమంలో పెరిగాడు

Published : 14 Aug 2022 03:03 IST

వనస్థలిపురం, న్యూస్‌టుడే:  అనాథాశ్రమంలో పెరిగాడు. తర్వాత మద్యం, జల్సాలకు అలవాటుపడి దొంగగా మారిన ఇతడిని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం...మన్సూరాబాద్‌లో కేబీఆర్‌ ఫంక్షన్‌ హాలు సమీపంలో ఉంటున్న హరిప్రసాద్‌(22) మునగనూర్‌లోని అనాథాశ్రమంలో పెరిగాడు. వ్యసనాలకు బానిసైన అతను ల్యాప్‌టాప్‌లు, ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడ్డాడు. ఈ నెల 8న రాత్రి వనస్థలిపురం అభ్యుదయనగర్‌వాసి శివకుమార్‌కు చెందిన  బుల్లెట్‌ వాహనాన్ని దొంగిలించాడు. శనివారం పోలీసులు పెట్రోలింగ్‌లో భాగంగా తనిఖీలు చేస్తుండగా హరిప్రసాద్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో  విచారించారు. అభ్యుదయనగర్‌లో బుల్లెట్‌తోపాటు మరో రెండు బుల్లెట్లనూ చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని