logo

సోదరితో గొడవ..మహిళ ఆత్మహత్య

సోదరితో స్వల్ప విషయమై జరిగిన గొడవతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన షాయినాయత్‌గంజ్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అజయ్‌కుమార్‌, పీఎస్సై రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం.

Published : 14 Aug 2022 03:13 IST

గోషామహల్‌, బేగంబజార్‌: సోదరితో స్వల్ప విషయమై జరిగిన గొడవతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన షాయినాయత్‌గంజ్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ అజయ్‌కుమార్‌, పీఎస్సై రాఘవేందర్‌రెడ్డి కథనం ప్రకారం..జుమ్మేరాత్‌బజార్‌ దేవీనగర్‌లో నివసిస్తున్న మానస(21)కు రెండేళ్ల క్రితం వెంకట్‌తో వివాహం జరిగింది. ఏడాది క్రితం  వెంకట్‌ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఒంటరిగా మిగిలిన మానస తన సోదరి రేణుక వద్ద నివసిస్తోంది. కల్లు తాగే అలవాటున్న మానస తన సోదరితో ఇటీవల తరచుగా గొడవ పడుతోంది. తాజాగా శుక్రవారం రాత్రి స్వల్ప విషయమై ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తురాలైన మానస రేణుకపై ఇంటి నుంచి బయటకు వచ్చి షాయినాయత్‌గంజ్‌ ఠాణా పక్కనే ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. కాలిన గాయాలతో ఆమె ఠాణాలోకి పరుగెత్తింది. పోలీసులు మంటలార్పి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని