logo

టెన్నిస్‌ ఛాంప్స్‌ హర్షిణి, ప్రసన్న రావు

అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) జాతీయ సిరీస్‌ అండర్‌-18 టోర్నీలో హర్షిణి విశ్వనాథ్‌, ప్రసన్న రావు విజేతలుగా నిలిచారు.

Published : 14 Aug 2022 03:34 IST

ఈనాడు, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) జాతీయ సిరీస్‌ అండర్‌-18 టోర్నీలో హర్షిణి విశ్వనాథ్‌, ప్రసన్న రావు విజేతలుగా నిలిచారు. శనివారం సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీలో జరిగిన అమ్మాయిల సింగిల్స్‌ ఫైనల్లో హర్షిణి 6-4, 6-3 తేడాతో శ్రీవల్లిపై గెలిచింది. అబ్బాయిల సింగిల్స్‌ తుదిపోరులో ప్రసన్న రావు 3-6, 6-3, 6-4తో సిద్ధార్థ్‌ గౌతమ్‌పై నెగ్గాడు. అబ్బాయిల డబుల్స్‌లో యశ్వంత్‌- రాహుల్‌ జోడీ 7-6 (7-4), 7-6 (7-5)తో నైశిక్‌- యజ్ఞేశ్‌పై, అమ్మాయిల డబుల్స్‌లో సెజల్‌- ప్రిన్సి జంట 7-5, 6-4తో నిరళి- శ్రీవల్లిపై నెగ్గి ట్రోఫీలు సొంతం చేసుకున్నాయి.

సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలకు బాస్కెట్‌బాల్‌ టైటిల్‌
సీఐఎస్‌సీఈ ఏపీ, తెలంగాణ ప్రాంతీయ స్పోర్ట్స్‌, గేమ్స్‌ బాస్కెట్‌బాల్‌ టోర్నీలో సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ పాఠశాల (కింగ్‌కోఠి) ఛాంపియన్‌గా నిలిచింది. అండర్‌-17 బాలుర ఫైనల్లో ఆ జట్టు 40-28 తేడాతో ది ఫ్యూచర్‌ కిడ్స్‌పై విజయం సాధించింది. అండర్‌-14 బాలుర ట్రోఫీని ది ఫ్యూచర్‌ కిడ్స్‌ సొంతం చేసుకుంది. తుదిపోరులో ఆ జట్టు 19-6తో సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలపై గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని