logo

Hyderabad: మా వాళ్ల ఇంట్లో వేడుకకు రానంటావా?.. వీడియోకాల్‌ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య

‘మీ బంధువుల వివాహాలకు నేను హాజరయ్యాను.. మా బంధువుల ఇంట్లో బోనాలకు నువ్వెందుకు రావడం లేదని’ భార్యపై అలిగిన భర్త ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం

Updated : 15 Aug 2022 08:45 IST

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: ‘మీ బంధువుల వివాహాలకు నేను హాజరయ్యాను.. మా బంధువుల ఇంట్లో బోనాలకు నువ్వెందుకు రావడం లేదని’ భార్యపై అలిగిన భర్త ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడుతూనే ఉరేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్సై నయీముద్దీన్‌ల కథనం ప్రకారం... తుక్కుగూడలో ఉండే సాయి కార్తిక్‌గౌడ్‌(33), భార్య తో కలిసి ఈనెల 12న ఆమె బంధువుల ఇంట్లో పెళ్లికి కందుకూరు మండలం బేగంపేట వెళ్లాడు. పుట్టింటివాళ్లు కావడంతో భార్య అక్కడే ఉండిపోగా భర్త శనివారం ఇంటికి వచ్చాడు. ఆదివారం మీర్‌పేటలో జరిగే బోనాల పండగకి తన పిన్ని ఇంటికి వెళదామని భార్యకు పదే పదే ఫోన్‌ చేశాడు. ఆమె ఆ విషయాన్ని తేలికగా తీసుకుంది. మనస్తాపంతో సాయి కార్తిక్‌ రవళికి వీడియో కాల్‌ చేసి మీ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లిళ్లు, ఇతర విందులకు నేను హాజరవుతున్నా.. మా వాళ్ల వద్దకు నీవెందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ దూలానికి ఉరేసుకున్నాడు. ఆ సమయంలో ఫోన్‌ పడేయడంతో దృశ్యాలు కానరాలేదు. వెంటనే భర్త వద్దకు బయలుదేరిన రవళి పక్కింటి వాళకు ఫోన్లు చేస్తూ భర్తను కాపాడాలని వేడుకుంది. ఇంటికి చేరుకునేప్పటికే భర్త మృతి చెందడంతో ఆమె కుప్పకూలింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని