ఎందరో సమరయోధులు.. అందరికీ వందనాలు
బ్రిటిష్ సామ్రాజ్యవాద విస్తరణకు వ్యతిరేకంగా కొందరు.. నిజాం పాలనను అంతమొందించాలని మరికొందరు.. ఉన్నత పదవులు వదిలిపెట్టి, చేస్తున్న వృత్తులకు విరామమిచ్చి స్వతంత్రం కోసం హైదరాబాద్కు చెందిన పలువురు పిడికిలి బిగించారు. బ్రిటీషర్లను
బానిస సంకెళ్ల విముక్తికి వీరోచిత పోరాటం
ఈనాడు, హైదరాబాద్
బ్రిటిష్ సామ్రాజ్యవాద విస్తరణకు వ్యతిరేకంగా కొందరు.. నిజాం పాలనను అంతమొందించాలని మరికొందరు.. ఉన్నత పదవులు వదిలిపెట్టి, చేస్తున్న వృత్తులకు విరామమిచ్చి స్వతంత్రం కోసం హైదరాబాద్కు చెందిన పలువురు పిడికిలి బిగించారు. బ్రిటీషర్లను భారత గడ్డ నుంచి తరిమేవరకు... రజాకార్ల దాష్టీకాలను అంతం చేసేవరకు ప్రత్యక్షంగా, కాందిశీకులుగా అలుపెరగని పోరాటం చేశారు. ఎవరి స్థాయిలో వారు భరతమాత బానిస సంకెళ్ల నుంచి స్వేచ్ఛ కోసం పెద్ద ఉద్యమమే చేశారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ ఎందరో సమరయోధులు.. అందరికీ వందనాలు.
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా...
బ్రిటిష్ సామ్రాజ్యవాద విషకౌగిలి నుంచి హైదరాబాద్ స్టేట్ను విముక్తం చేయడానికి కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో హైదరాబాద్కు చెందిన రాజా మహీపతిరాం ఒకరు. నిజాం హయాంలోని బిరార్కు 1800 నుంచి 1806 వరకు గవర్నర్గా ఉండేవారు. బ్రిటీష్ రెసిడెంట్ ఒత్తిడితో మహీపతిరావును గవర్నర్ పదవి నుంచి తొలగించారు. అయినా లెక్కచేయకుండా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
ఉద్యోగానికి రాజీనామా చేసి..
హైదరాబాద్కు చెందిన బాఖర్ అలీ నిజాం ప్రభుత్వంలో అటవీ శాఖ అధికారి. జాతీయ ముస్లింవాది కావడంతో బ్రసెల్స్లో జరిగిన యాంటీ ఇంపీరియలిస్టు సదస్సుకు భారతీయ ప్రతినిధిగా వెళ్లారు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా అక్కడ గళం విప్పారు. బ్రిటిష్ వ్యతిరేక విధానాలను వదిలిపెట్టాలని నిజాం ప్రభుత్వం ఆదేశించడంతో... నిరసనగా ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కార్మిక పోరాటాలకు నాయకత్వం వహించారు. రజాకార్ల దురాగతాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడండి.. వారిని చెల్లాచెదురు చేయండని.. 1948 ఆగస్టు 13న జాతీయ ముస్లింలు నిజాంకు జారీ చేసిన తాఖీదుపై సంతకం చేసిన వారిలో బాఖర్ ఒకరు.
కలం ఎక్కుపెట్టి..
చేవెళ్లలో పుట్టినా హైదరాబాద్లో స్థిరపడిన మందముల నరసింగరావు న్యాయ శాస్త్ర పట్టభద్రులు. కాంగ్రెస్ నాయకుడు, పత్రిక రచయిత కూడా. 1921లో ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించిన ప్రముఖుల్లో ఒకరు.. న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి 1927లో రయ్యత్ ఉర్దూ వార పత్రికను స్థాపించి నిజాంపాలన వ్యవస్థపై అనేక విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో పత్రిక నిషేధాన్ని ఎదుర్కొంది. 1937లో నిజామాబాద్లో జరిగిన ఆరో ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. నిజాంకు వ్యతిరేకంగా రాజకీయ కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో 1945లో అరెస్ట్ అయ్యారు.
17 ఏళ్ల వయసులోనే..
హైదరాబాద్ విముక్తి కోసం జరిగిన పోరాటంలో ఎన్.ఎస్.రఘునందనరావు చెప్పుకోతగ్గ పాత్ర పోషించారు. 17 ఏళ్ల చిన్న వయసులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావడానికి జరిగిన పోరాటాల్లో కదం తొక్కారు. నిజాం వ్యతిరేక ఊరేగింపు, ప్రభాత భేరీలు నిర్వహిస్తూ.. వీధుల్లో జాతీయ జెండాలు ఎగురవేశారు. రజాకార్ల ఆగడాలను నిలువరించడానికి బస్తీ నిఘా కమిటీలు ఏర్పాటు చేశారు. పోలీసుల లాఠీఛార్జీల్లో గాయపడ్డారు. అరెస్టును పసిగట్టి చాకచక్యంగా తప్పించుకున్నారు. అజ్ఞాత యోధునిగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ... ఆయుధాలు సేకరించి సరిహద్దు పోరాట కేంద్రాలకు చేరవేసేవారు.
తుపాకీ పేల్చి తప్పించుకున్నాడు..
సికింద్రాబాద్ లాలాపేటకు చెందిన చెట్టి లక్ష్మయ్య నిజాం రైల్వేలో పనిచేస్తూ.. 1942 జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. లాలాపేట గ్రామ కావలి ముత్తయ్యను లాలాగూడలో రజాకార్లు చంపి నడిరోడ్డుపై పడేసి ఆ తర్వాత లక్ష్మయ్య ఇంటిపై దాడి చేశారు. రెండు నాటు బాంబులను రజాకార్లపై విసిరి, తుపాకీ పేలుస్తూ తప్పించుకుని సికింద్రాబాద్ పారిపోయారు. సాయుధ పోరాటానికి శిక్షణ పొందిన యోధులతో కలిసి పనిచేశారు. వి.బి.రాజు నాయకత్వంలో హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం అనేక పోరాటాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!