logo

బయట మద్యం తాగొద్దన్నందుకు గొడవ

మద్యం తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తితో మొదలైన గొడవ పరస్పరం దాడులకు దారితీసింది. నారాయణగూడ ఠాణా పరిధిలోని వైఎంసీఏ కూడలిలో ఉన్న ఓ వైన్‌షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ప్రదీప్‌ తెలిపిన వివరాల

Published : 15 Aug 2022 03:16 IST

వేడి నూనె పోయడంతో ఒకరికి గాయాలు

నారాయణగూడ, న్యూస్‌టుడే: మద్యం తాగేందుకు వచ్చిన ఓ వ్యక్తితో మొదలైన గొడవ పరస్పరం దాడులకు దారితీసింది. నారాయణగూడ ఠాణా పరిధిలోని వైఎంసీఏ కూడలిలో ఉన్న ఓ వైన్‌షాప్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై ప్రదీప్‌ తెలిపిన వివరాల ప్రకారం... విఠల్‌వాడికి చెందిన సునీల్‌పాల్‌ (29) మహాలక్ష్మి వైన్‌షాప్‌లో పనిచేస్తున్నాడు. కింగ్‌కోఠి పర్దాగేట్‌కు చెందిన ఆసిఫ్‌ స్నేహితుడితో కలిసి మద్యం తాగడానికి అక్కడికి వచ్చాడు. వీరిద్దరూ దుకాణం వెలుపల మద్యం తాగుతుంటాన్ని గమనించిన సునీల్‌పాల్‌ లోపలికి వెళ్లాలని సూచించాడు. దాంతో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో సునీల్‌పాల్‌ ఆసిఫ్‌పై చేయిచేసుకున్నాడు. ఆగ్రహించిన ఆసిఫ్‌ ఇప్పుడే వస్తానంటూ వెళ్లి శాంతి థియేటర్‌ వద్ద ఉన్న ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నుంచి కప్పులో మరుగుతున్న నూనె తెచ్చి సునీల్‌పాల్‌పై వేశాడు. గాయపడిన అతడిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని