logo

ఆ కుటుంబానికి.. గుండె‘పోటు’

సహజంగా ఏదైనా కుటుంబ చరిత్రను తీసుకుంటే రకరకాల కారణాలతో గతించిన వారు కనిపిస్తారు. ఒకే కారణంతో మృత్యువాత పడుతున్న వారు చాలా అరుదుగా ఉంటారు. చెంగోల్‌లోని ఓ

Published : 15 Aug 2022 03:16 IST

నాడు తండ్రి, తమ్ముడు, నేడు ఎల్లప్ప

తాండూరు గ్రామీణ: సహజంగా ఏదైనా కుటుంబ చరిత్రను తీసుకుంటే రకరకాల కారణాలతో గతించిన వారు కనిపిస్తారు. ఒకే కారణంతో మృత్యువాత పడుతున్న వారు చాలా అరుదుగా ఉంటారు. చెంగోల్‌లోని ఓ కుటుంబానికి చెందిన వ్యక్తులు గుండెపోటుతోనే మృత్యు ఒడి చేరుతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే... గ్రామస్థుల కథనం ప్రకారం.. చెంగోల్‌లో క్షేత్ర సహాయకురాలి భర్త ఎల్లప్ప (50) వ్యవసాయం, ఉపాధి కూలీ పనులు చేస్తుంటాడు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రకు ఉపక్రమించాడు. 11గంటల ప్రాంతంలో అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో పాము కరిచిందేమోనని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వికారాబాద్‌ మిషన్‌ ఆస్పత్రికి తరలించగా తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన తండ్రి బాలప్ప ఎనిమిది సంవత్సరాల క్రితం, తమ్ముడు చిన్నఎల్లప్ప నాలుగు సంవత్సరాల క్రితం గుండెపోటుతోనే మృతి చెందారు. తాజాగా ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు