logo

నాగారం మండల ఏర్పాటుకు డిమాండ్‌

మండల పరిధిలోని నాగారం గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటుచేయాలని మంగళవారం గ్రామస్థులు, యువకులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు.

Published : 17 Aug 2022 01:54 IST

ధారూర్‌: మండల పరిధిలోని నాగారం గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటుచేయాలని మంగళవారం గ్రామస్థులు, యువకులు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగారం పరిసర 18 గ్రామ పంచాయతీలతో కొత్త మండల ఏర్పాటుచేస్తే ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటున్న నేపథ్యంలో తమ అవసరాలను కూడా గుర్తించాలన్నారు. పరిపాలన చేరువ కావడానికి నూతన మండలాలు ఎంతో దోహదం చేస్తా యన్నారు. విన్నపాలను పరిశీలించాలని కోరారు. కార్యక్రమంలో స్థానికులు వెంకట్‌రెడ్డి, కుద్రత్‌, బోయిని నర్సింలు, కరీం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని