నాలుగు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తాం..
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు కలిపి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో మరింత బాగా పనులు చేసుకుందామన్నారు.
తెలంగాణ రాకుంటే ఈ అభివృద్ధి సాధ్యమయ్యేదికాదు
సీఎం కేసీఆర్
ఈనాడు, వికారాబాద్ - న్యూస్టుడే, వికారాబాద్, వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ టౌన్
ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు కలిపి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. భవిష్యత్తులో మరింత బాగా పనులు చేసుకుందామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గతంలో మన వ్యవసాయం ఎలా ఉండేదో అందరికీ తెలుసన్నారు. కరెంటు లేక, మోటార్లు కాలి, ఎంతగానో గోసపడ్డామన్నారు. వచ్చిన తెలంగాణలో మళ్లీ పాత పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే అన్ని విధాలా చైతన్యం కావాలన్నారు. రూ.60.7 కోట్ల వ్యయంతో నిర్మించిన కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ప్రశాంత్రెడ్డి, జిల్లా పాలనాధికారి నిఖిల తదితరులతో కలిసి మంగళవారం ప్రారంభించారు. రూ.235 కోట్ల అంచనాతో నిర్మించనున్న వైద్యకళాశాలకు శంకుస్థాపన చేశారు. పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసగించిన ఆయన ప్రధానంగా భాజపాపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని మోదీ నుంచి భాజపా కార్యకర్తల వరకు వారి తీరును ఎండగట్టారు. తన బస్సుకు అడ్డుగా వచ్చిన భాజపా కార్యకర్తలు, నేతల వ్యవహారాన్ని ఘాటుగా విమర్శించారు. దమ్ముంటే తెలంగాణకు మంచి జరిగేలా కేంద్రాన్ని ప్రశ్నించాలని వారిని హితవు పలికారు. వైద్యకళాశాల మంజూరు చేసి శంఖుస్థాపన చేయడం, కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించినందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అధ్యక్షతన సాగిన ఈసభలో జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు మహేష్రెడ్డి, రోహిత్రెడ్డి, నరేందర్రెడ్డి, కాలె యాదయ్మ, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
సభా వేదికపై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీత, ఎమ్మెల్యే ఆనంద్, మంత్రి సబితా రెడ్డి,
ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, యాదయ్య తదితరులు
వికారాబాద్ జిల్లా సాధ్యమయ్యేదా?
తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలను ఆదుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టునూ పూర్తి చేసి సాగు నీళ్లిస్తామన్నారు. సభ ముగిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇళ్లకు వెళ్లిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పథకాల మీద చర్చించాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడే వారిని పట్టించుకోవద్దన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు చాలా మంది వస్తారన్నారు. ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలపై సమగ్రంగా ప్రజలకు వివరించారు.
నూతన కలెక్టరేట్లో తన స్థానంలోకూర్చునేముందు కేసీఆర్కు అభివాదం చేస్తున్న కలెక్టర్ నిఖిల
తెరాస శ్రేణుల్లో నూతనోత్సాహం
ముఖ్యమంత్రి కేసీఆర్ సభ తెరాస శ్రేణుల్లో ఆసాంతం ఉత్సాహం నింపింది. ప్రధానంగా భాజపాను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించడంతో సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది. సభికుల్లో ఆలోచన రేకెత్తించే విధంగా ఆద్యంతం ఆసక్తిగా సాగిన ప్రసంగం ఆకట్టుకుంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేశారు. నృత్యాలు, డప్పు వాయిద్యాలతో కార్యకర్తలు, ప్రజలు సభ ప్రాంగణానికి తరలివచ్చారు. సభ ముగిసిన అనంతరం రెండున్నర గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
పార్టీ కార్యాలయం ప్రారంభించి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ను కూర్చోబెడుతున్న కేసీఆర్
ఇవీ... విశేషాలు
* మధ్యాహ్నం 3.15 గంటలకు కేసీఆర్ హెలికాప్టర్లో వికారాబాద్కు చేరుకున్నారు. జిల్లా ఎస్సీ కార్యాలయంలో కేసీఆర్ దిగగానే మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ మంజుల పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
* మధ్యాహ్నం 3.25 గంటలకు ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యే ఆనంద్ స్వగృహానికి వెళ్లి తేనేటీ విందు స్వీకరించారు.
* వాతావరంణం చల్లగా ఉండటం, చిరు జల్లులు పడటంతో మళ్లీ వర్షం పడుతుందేమోనని నిర్వాహకులు, నేతలు కొంత కంగారు పడ్డారు.
* జిల్లా సమీకృత భవాన్ని ప్రారంభించారు. అక్కడే జిల్లా వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి అభినందనలు వెల్లడయ్యాయి.
* సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభావేదికపైకి చేరుకున్నారు.
* 5.5 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించారు.దాదాపు 6వేలమంది సభకు తరలి వచ్చారు. సీఎం ప్రసంగం వినేందుకు ఉత్సాహం చూపారు.
* స్థానిక తండాల వాసులు తమ సమస్యల పరిష్రాఆనికి నిరసన కార్డులు ప్రదర్శించారు.
* సీఎం సభావేదికపైకి వచ్చే వరకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు పాటలు పాడి సభికులను ఉత్సాహపరిచారు. కొంత సేపటికి వేదిక కింద పడటంతో ఇబ్బంది కలిగింది.
* వర్షం కురిసినా వచ్చిన వారికి ఇబ్బందులు కలుగకుండా నాలుగు షెడ్లు ఏర్పాటు చేశారు.
పట్టణం... గులాబీమయం
కేసీఆర్ రాక సందర్భంగా జిల్లా కేంద్రం వికారాబాద్ పట్టణ ప్రధాన దారులు గులాబిమయంగా మారాయి. నాయకులు కేసీఆర్కు స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కూడళ్లలో జెండాలు రెపరెపలాడాయి.
సమీకృత భవనంలో చండీ యాగం
కలెక్టరేట్ను కేసీఆర్ ప్రారంభించిన అనంతరం వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన చండీయాగంలో ముఖ్యమంత్రితోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన మహిళలు
అభివృద్ధికి నిధులివ్వాలి.. : మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే
వేదికపై తొలుత వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడారు. గతంలోనే పరిగి, వికారాబాద్లకు రెండు డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారన్నారు. వికారాబాద్ పట్టణంలో తాను సీఎంతో పాటు వస్తూ రైల్వేవంతెనను చూపించానన్నారు. దానిని బాగు చేసేలా చూడాలన్నారు. అనంతగిరిని అన్ని విధాలుగా పర్యాటకంగా తీర్చిదిద్దాలని కోరారు. వికారాబాద్ చుట్టూ రింగ్రోడ్డు నిర్మించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేయాలని సీఎం కేసీఆర్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్