logo

‘పింగళి వెంకయ్య విగ్రహాన్ని అలంకరించకపోవడం విచారకరం’

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తున్న తరుణంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహాన్ని పాలకులు....

Published : 17 Aug 2022 01:54 IST


ట్యాంక్‌బండ్‌పై పింగళి వెంకయ్య విగ్రహాన్ని వద్ద దీక్ష చేస్తున్న వి.హనుమంతరావు చిత్రంలో రాములునాయక్‌, కాంగ్రెస్‌ నేతలు

రాంనగర్‌, న్యూస్‌టుడే: స్వతంత్ర భారత వజ్రోత్సవాలు, అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహిస్తున్న తరుణంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య విగ్రహాన్ని పాలకులు విస్మరించారని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. మంగళవారం ట్యాంక్‌బండ్‌పై పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ఆయన దీక్ష చేశారు. మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌, కాంగ్రెస్‌ నేతలు దీక్షకు మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని