logo

సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు రాజ్యాధికారం సాధించాలి

సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు రాజ్యాధికారం  సాధించుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ

Published : 17 Aug 2022 01:54 IST


మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, చిత్రంలో కిషోర్‌గౌడ్‌, ఎమ్మెల్యే గోపాల్‌, బాలరాజ్‌, వెంకన్నగౌడ్‌ తదితరులు

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: సర్దార్‌ సర్వాయి పాపన్న స్ఫూర్తితో బహుజనులు రాజ్యాధికారం  సాధించుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ జయంతి సభలో ఆయన మాట్లాడారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వారు ఉద్యమ చరిత్రను తెలుసుకొని ఆయన విగ్రహాన్ని ఆ యూనివర్సిటీలో నెలకొల్పారని మంత్రి గుర్తు చేశారు. పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ఈ నెల 18 నుంచి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ గౌడల అభివృద్ధి తెరాస ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. సమన్వయ కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ బాలగౌని బాలరాజ్‌గౌడ్‌, రాష్ట్ర కన్వీనర్‌ అయిలి వెంకన్నగౌడ్‌ మాట్లాడుతూ.. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ప్రజాగాయని విమలక్క, బీసీ కమిషన్‌ సభ్యుడు కిషోర్‌గౌడ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌, బెల్లయ్యనాయక్‌, వీజీఆర్‌ నారగోని పల్లె లక్ష్మణ్‌గౌడ్‌, ఎలికట్టె విజయ్‌కుమార్‌గౌడ్‌, గడ్డమీద విజయ్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని