వచ్చేసింది.. పుస్తక మహోత్సవం
గాంధీజీ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలు.. అందంగా తీర్చిదిద్దిన కళాకృతులు.. చేనేత వస్త్ర కళను కళ్లకు కట్టే మగ్గం.. ‘అక్షరాభ్యాస్’ పలకలు.. 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలు..
ఎల్బీస్టేడియం వేదికగా ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: గాంధీజీ సిద్ధాంతాలను బోధించే పుస్తకాలు.. అందంగా తీర్చిదిద్దిన కళాకృతులు.. చేనేత వస్త్ర కళను కళ్లకు కట్టే మగ్గం.. ‘అక్షరాభ్యాస్’ పలకలు.. 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల జీవిత గాథలు.. ఇలా ఎన్నెన్నో విశేషాలతో పుస్తక మహోత్సవం వచ్చేసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఎల్బీస్టేడియం వేదికగా వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన ప్రారభమైంది. తెలంగాణ సాహిత్యఅకాడమీ ఆధ్వర్యంలో దాదాపు 50 స్టాళ్లలో ఎన్నో రకాల పుస్తకాలు కొలువుదీరాయి. దీన్ని మంగళవారం రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ హాజరై ప్రారంభించారు. గాంధీజీ ఇచ్చిన పిలుపు మేరకు విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్త్ర తయారీని సూచించేలా భారీ చరఖాను వేదిక వద్ద ఏర్పాటుచేశారు. స్వాతంత్య్ర పోరాట ఘట్టాలతో చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. స్వచ్ఛమైన గానుగ నూనెలు వాడాలని సూచిస్తూ వాటి తయారీని వివరించేలా ఎడ్లతో ప్రదర్శిస్తున్నారు. పుస్తక మహోత్సవం ఈ నెల 22వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగనుందని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ తెలిపారు. వివిధ రచయితలు రాసిన దాదాపు 3వేల పుస్తకాలు అందుబాటులో ఉంచారు. యువతను ఆకట్టుకునేందుకు వివేకానందుడి జీవిత విశేషాల పుస్తకాలతో రామకృష్ణమఠం తరఫున ప్రత్యేక స్టాల్ ఏర్పాటుచేశారు. సాహిత్య నికేతన్ స్టాల్లో 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల పుస్తకాల సెట్ విక్రయిస్తున్నారు. నల్లమల్లారెడ్డి ట్రస్టు తరఫున చిన్నారుల కోసం అక్షరాభ్యాసం కిట్లు అందుబాటులో ఉంచారు. కేపీహెచ్బీకి చెందిన కేబీటీ సుందరి అనే వృద్ధురాలు ఏర్పాటుచేసిన స్టాల్లో తాటి మొవ్వ ఆకులతో వేసిన బుట్టలు కళాకృతులు ఆకట్టుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!