మా ఊరొస్తారా.. కాచుకోండి!
సైబర్ నేరస్థులు చెలరేగుతున్నారు. పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై దాడులకూ తెగబడుతున్నారు. తాజాగా బిహార్ నవాడా జిల్లాలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులపై తుపాకులతో కాల్పులు జరపటం కలకలం రేకెత్తించింది.
ఈ ఏడాది 7 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా సైబర్నేరాలపై సుమారు 9,300 కేసులు నమోదైతే 5,000 వరకూ గ్రేటర్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్స్లోనివే కావటం పరిస్థితికి అద్దంపడుతోంది.
సైబర్ నేరస్థులు చెలరేగుతున్నారు. పట్టుకొనేందుకు వెళ్లిన పోలీసులపై దాడులకూ తెగబడుతున్నారు. తాజాగా బిహార్ నవాడా జిల్లాలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులపై తుపాకులతో కాల్పులు జరపటం కలకలం రేకెత్తించింది. సకాలంగా నవాడా జిల్లా పోలీసులు రావటంతో పెను ప్రమాదం తప్పినట్టు సమాచారం. ఇటీవల బిఘా గ్రామంలో మితిలేష్ ప్రసాద్ అనే సైబర్ నేరస్థుడిని పట్టుకునేందుకు ఆరుగురు సిబ్బందితో ఇన్స్పెక్టర్ వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన సైబర్ నేరస్థులు గాల్లోకి కాల్పులు జరిపారు. సకాలంలో స్థానిక పోలీసులు చేరటంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడి పోలీసులు నిరాయుధులుగా వెళ్లినట్టు సమాచారం. గతంలో రాజస్థాన్, దిల్లీ, మధ్యప్రదేశ్ల్లో ఇదే తరహా ప్రతిదాడులు ఎదురైనా ఇప్పటికీ అదే ఉదాసీనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
తుపాకులతో పహారా.. బిహార్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, నేపాల్ తదితర ప్రాంతాల్లో పది, ఇంటర్ తప్పిన యువకులు నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు. రూ.వేల సంపాదన నుంచి రూ.కోట్లకు చేరారు. మందీ, మార్బలం తయారు చేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు రూ.లక్షల్లో కమీషన్ ముట్టజెబుతున్నారు. అరెస్టయితే క్షణాల్లో బెయిల్పై బయటకు వచ్చేందుకు వ్యక్తిగత న్యాయవాదులను నియమించుకుంటున్నారు. ఇంత పకడ్బందీగా నేరాలకు పాల్పడుతున్న ముఠాలను పట్టుకొనేందుకు పోలీసులు అరకొర జాగ్రత్తలతో వెళ్తున్నారు. విమాన ప్రయాణంలో తుపాకులు తీసుకెళ్లటంపై నిషేధం ఉండటంతో స్థానిక పోలీసుల సహకారం ఉంటుందనే భరోసాతో చేరుతున్నారు. ఒకే ఒక్క స్మార్ట్ఫోన్ సాయంతో రూ.లక్షలు సంపాదించే అవకాశం ఉండటంతో అక్కడి గ్రామాల్లోని యువకులు మోసాలను వృత్తిగా మార్చుకుంటున్నారు. అక్కడి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఎక్కువ సంపాదన ఉన్న మోసగాళ్లతో పెళ్లి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు. ప్రాణాలకు తెగించి నిందితులను అరెస్ట్ చేసినా.. ఆయా రాష్ట్రాల న్యాయస్థానాలు నిందితులను ట్రాన్సిట్ వారెంట్పై తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చినా నగరంలోని కొన్ని న్యాయస్థానాలు సైబర్ నేరస్థులకు వెంటనే బెయిలిస్తున్నట్టు పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్మును భారీగా కాజేస్తున్నారంటూ చెబుతున్నా తమ మాటలు పట్టించుకోవట్లేదంటూ వాపోయారు.
అనుభవాలు నేర్వని పాఠాలు
ఇటీవల కర్ణాటక గొలుసు దొంగలను పట్టుకునేందుకు వెళ్లిన సీసీఎస్ హెడ్కానిస్టేబుల్ యాదయ్య కత్తిపోట్లకు గురయ్యారు. మాదాపూర్ జోన్ పరిధిలోని ఓ ఠాణాలోకి వచ్చిన స్థిరాస్తి వ్యాపారి ఇన్స్పెక్టర్పై దాడికి దిగినట్టు సమాచారం. రెండు నెలల క్రితం బండ్లగూడ జాగీర్ వద్ద మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న నైజీరియన్ను పట్టుకునేందుకు వెళ్లిన ఎస్వోటీ పోలీసులకు ఇదే అనుభవం ఎదురైంది. కళ్లెదుట పోలీసులపై దాడులు జరుగుతున్నా నేర పరిశోధన, అంతరాష్ట్ర దొంగలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులను నిరాయుధులుగా పంపుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడి అరెస్ట్
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అనుమానితుడిని విజయవాడ అజిత్సింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు సహా ఐదుగురిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
గంజాయి విక్రేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. హ్యాష్ ఆయిల్.. చాక్లెట్లుగా మార్చి విక్రయించడం పాత ట్రెండు.. ఇప్పుడు గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. -
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని నార్కట్పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో భారాస నాయకుడు మృతిచెందారు. -
ప్రకాశం జిల్లాలో మద్యం డంప్ స్వాధీనం
ప్రకాశం జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్శి సెబ్ కార్యాలయంలో ఎస్పీ గరుడ్ సుమిత్సునీల్ బుధవారం వివరాలను వెల్లడించారు. -
మావోయిస్టులకు శరాఘాతం!
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఉత్తర బస్తర్ డివిజన్ కమిటీ భారీ మూల్యం చెల్లించుకుంది. -
జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారీ
కిటికీ గ్రిల్స్ తొలగించి జువెనైల్ హోమ్ నుంచి ఎనిమిది మంది బాలురు పరారైన ఘటన మేడ్చల్ జిల్లా గాజులరామారంలో సంచలనం సృష్టించింది. -
తప్పుడు ప్రకటనలతో మందుల విక్రయం
జ్వరాన్ని నయం చేస్తుందని తప్పుడు ప్రకటనలతో విక్రయిస్తున్న మందులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
గుజరాత్లో రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
గుజరాత్లో ఆగివున్న చమురు ట్యాంకర్ను వేగంగా వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా 10 మంది దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు. -
అనంత్నాగ్లో బిహార్ కూలీని కాల్చిచంపిన ఉగ్రవాదులు
జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. బుధవారం అనంత్నాగ్ జిల్లాలో బిహార్కు చెందిన కూలీని కాల్చి చంపారు.
తాజా వార్తలు (Latest News)
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్