క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో జాప్యం ఉండదిక
పేద క్యాన్సర్ రోగులకు పెద్ద ఊరట. వసతుల కొరతతో చికిత్సల్లో జరుగుతున్న జాప్యానికి ఇక నుంచి తెరపడనుంది. నాంపల్లి ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అధునాతన హంగులు సంతరించుకుంది. కొత్తగా అత్యాధునిక సదుపాయాలతో 8 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి.
నిత్యం 30-40 వరకు ఆపరేషన్లు అయ్యేలా ఏర్పాట్లు
ఎంఎన్జేలో 8 మాడ్యులర్ థియేటర్లు సిద్ధం
ఈనాడు, హైదరాబాద్
అధునాతన పరికరాలు
పేద క్యాన్సర్ రోగులకు పెద్ద ఊరట. వసతుల కొరతతో చికిత్సల్లో జరుగుతున్న జాప్యానికి ఇక నుంచి తెరపడనుంది. నాంపల్లి ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ అధునాతన హంగులు సంతరించుకుంది. కొత్తగా అత్యాధునిక సదుపాయాలతో 8 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. మరో పది రోజుల్లో వీటిని ప్రారంభించనున్నారు. థియేటర్ల నిర్మాణం.. పరికరాల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు వెచ్చించింది. క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఒకే ఒక ఆసుపత్రి ఎంఎన్జే. ఈ దవాఖానాకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సరిహద్దు రాష్ట్రాల నుంచి పేద, మధ్యతరగతి ప్రజలకు వస్తుంటారు. ప్రైవేటులో లక్షలు ఖర్చు చేసుకొని.. వ్యాధి నయం కాక.. చివరకు ఎంఎన్జేకు వచ్చి ఉపశమనం పొందే వారు ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 450 సాధారణ పడకలు.. 100 పిల్లల పడకలు ఉన్నాయి. నిత్యం 450-500 ఓపీ ఉంటోంది. ఏటా 20 శాతం వరకు రోగుల రద్దీ పెరుగుతోంది. తల, మెడ, నోరు, పొట్ట, కాలేయం, వ΄త్రపిండాలు, అండాశయం, వ΄త్రాశయం.. ఇతర శరీర భాగాల్లో వచ్చే క్యాన్సర్కు శస్త్ర చికిత్సలు అవసరం. ప్రస్తుతం వ΄డే శస్త్రచికిత్స థియేటర్లు ఉండటంతో తమ వంతు వచ్చే సరికి రెండు, వ΄డు నెలల సమయం పడుతోందని రోగులు వాపోతున్నారు. అంతవరకు ఔషధాలతో నెట్టుకొస్తున్నారు. కణితి తొలగింపులో జాప్యం చేస్తే.. అవి ముదిరి ఇతర భాగాలకు సోకే ముప్పు ఎక్కువ. తాజాగా సిద్ధం చేసిన ఆపరేషన్ థియేటర్లతో ఇలాంటి రోగులకు పెద్ద ఉపశమనం లభించనుంది. ఇక నుంచి ఎలాంటి జాప్యం ఉండదని.. ఒకటి రెండు రోజుల్లో శస్త్ర చికిత్సలు చేస్తామని ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ జయలత వివరించారు.
ఎన్నో రకాలుగా ఉపయోగం
* ఈ థియేటర్లను అధునాతనంగా తీర్చిదిద్దారు. ఒక్కో థియేటర్ను ఒక్కో చికిత్సకు కేటాయించారు. రోబోటిక్ శస్త్రచికిత్సలకు ఒక థియేటర్ను పూర్తిగా అప్పగించారు. త్వరలో ఇవి ఎంఎన్జేలో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ కోత.. తక్కువ రక్త స్రావంతోపాటు చిన్న కణితిని సైతం తొలగించవచ్చు.
* ల్యాప్రోస్కోపిక్ చికిత్సలకు ప్రత్యేకంగా మరో థియేటర్ కేటాయించారు. గ్రైనిక్ చికిత్సలు, పిల్లల్లో వచ్చే కణితి తొలగింపునకు మరో థియేటర్, గ్యాస్ట్రోఎంటరాలజీ క్యాన్సర్లకు సంబంధించి ప్రత్యేకంగా ఒక థియేటర్ను వినియోగించనున్నారు.
* పొట్ట, అండాశయం, కాలేయాల్లో వచ్చే క్యాన్సర్లకు నేరుగా ఆ ప్రాంతంలో కీమోథెరఫీ ఇచ్చేందుకు శస్త్ర చికిత్స చేయాలి. ఇక నుంచి శస్త్ర చికిత్స చేసి నేరుగా కీమెథెరఫీ ఇచ్చేందుకు ఒక థియేటర్ను వాడుకోనున్నారు. నోటి, తల, మెడ క్యాన్సర్ల చికిత్సలకు మరో అధునాతన థియేటర్ను కేటాయించారు.
* అత్యాధునిక ఫిల్టర్లు వాడటం వల్ల వైరస్ లాంటి సూక్ష్మమైన వ్యాధి కారకాలు లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ముప్పు తప్పుతుంది.
* ఒక థియేటర్తో మరొక థియేటర్ను వీడియో..ఆడియోతో అనుసంధానం చేస్తారు. తద్వారా వైద్య విద్యార్థులు పక్క థియేటర్లో ఏమి జరుగుతుందో.. మరో థియేటర్ నుంచి చూసి నేర్చుకునే అవకాశం ఉంది. Úవలం చికిత్సలకే కాకుండా విద్యార్థులకు పరిశోధనలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్