logo

కూలీ దంపతులను ఢీకొన్న ట్రాక్టర్‌

కూలిపనుల్లో నిమగ్నమైన దంపతులపై తాగునీటి ట్యాంకర్‌ దూసుకురావడంతో..  భర్త కళ్ళెదుటే భార్య దుర్మరణం పాలైంది. పటాన్‌చెరు ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సిరూర్‌కు చెందిన భీమయ్య, ఎల్లమ్మ(45) దంపతులు..

Published : 18 Aug 2022 03:32 IST

భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం

ఎల్లమ్మ

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: కూలిపనుల్లో నిమగ్నమైన దంపతులపై తాగునీటి ట్యాంకర్‌ దూసుకురావడంతో..  భర్త కళ్ళెదుటే భార్య దుర్మరణం పాలైంది. పటాన్‌చెరు ఎస్సై ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌ మండలం సిరూర్‌కు చెందిన భీమయ్య, ఎల్లమ్మ(45) దంపతులు.. వీరిద్దరూ కొంతకాలంగా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ పరిధిలో నివసిస్తున్నారు. బుధవారం గ్రామానికి వెళ్లే కూడలి సమీపంలో మురుగుకాలువ పనుల్లో పాల్గొన్నారు. అదే సమయంలో పాశమైలారం నుంచి ఇస్నాపూర్‌ వైపు వస్తోన్న ప్రైవేటు తాగునీటి ట్యాంకర్‌.. అకస్మాత్తుగా వారిద్దరిపైకి దూసుకొచ్చింది. ట్యాంకర్‌ కందపడి భర్త కళ్లముందే ఆమె దుర్మరణం పాలైంది. భీమయ్యకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను సంగారెడ్డి సర్కారు దవాఖానాకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని