logo

కేసీఆర్‌ నోట త్యాగాల మాట సరికాదు: చంద్రశేఖర్‌

అనేక మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కేసీఆర్‌ మాత్రం చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించారని నిత్యం చెబుతున్నారు. మరోసారి ఈ మాట మాట్లాడితే ఉద్యమ సందర్భంగా నాడు జరిగిన ఘటనను పూస గుచ్చినట్లు చెబుతానని’

Published : 18 Aug 2022 03:32 IST

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: ‘అనేక మంది బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కేసీఆర్‌ మాత్రం చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించారని నిత్యం చెబుతున్నారు. మరోసారి ఈ మాట మాట్లాడితే ఉద్యమ సందర్భంగా నాడు జరిగిన ఘటనను పూస గుచ్చినట్లు చెబుతానని’ మాజీ మంత్రి, భాజపా నేత ఎ.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా వికారాబాద్‌ అభివృద్ధిని విస్మరించి..ఎన్నికలు సమీపించడంతో మభ్యపెట్టేందుకు మళ్లీ వరాలు కురిపించారని దుయ్యబట్టారు. కృష్ణా ట్రిబ్యూనల్‌, నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకాని ముఖ్యమంత్రి ఇప్పుడు కృష్ణా నదీ జలాలు ఇస్తామంటే నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు సి.విఠల్‌ మాట్లాడుతూ..పలు ప్రాంతాల్లో భాజపా నేతలను తెరాస ఎమ్మెల్యేలు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. భాజపా వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు