logo

ఆర్థిక ఇబ్బందులతో బిల్డర్‌ ఆత్మహత్య

ఉరి వేసుకొని బిల్డర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ ఐడీఏలోని లక్ష్మీనారాయణకాలనీలో ఉండే కడాలి రామకృష్ణాప్రసాద్‌(39) బిల్డర్‌గా చేస్తున్నారు. నెల క్రితం వారి కుటుంబం మాదాపూర్‌కు మారింది.

Published : 18 Aug 2022 03:44 IST

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఉరి వేసుకొని బిల్డర్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్‌ ఐడీఏలోని లక్ష్మీనారాయణకాలనీలో ఉండే కడాలి రామకృష్ణాప్రసాద్‌(39) బిల్డర్‌గా చేస్తున్నారు. నెల క్రితం వారి కుటుంబం మాదాపూర్‌కు మారింది. మంగళవారం నాగోల్‌లో ఉన్న నిర్మాణాన్ని చూసుకునేందుకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరారు. రాత్రి వరకు కూడా ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా లక్ష్మీనారాయణకాలనీలోని పాత ఇంట్లో ఉన్నట్లు చెప్పారు. బుధవారం ఫోన్‌ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. అనుమానం వచ్చి ఇంటి చుట్టు పక్కల వారు తలుపులు తొలగించి చూడగా చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని మృతుడి భార్య లక్ష్మీత్రివేణి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు