Congress: సోనియా అపాయింట్‌మెంట్‌ కోరిన కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి

Published : 18 Aug 2022 14:55 IST

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సోనియాకు వివరించాలనుకుంటున్నానని.. అందుకే అపాయింట్‌మెంట్‌ కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై ఆమెను కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. 

మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కూడా సోనియా అపాయింట్‌మెంట్‌ కోరారు. టీపీసీసీలో జరుగుతున్న పరిణామాలున వివరించనున్నట్లు ఆయన తెలిపారు. 

రాష్ట్ర కాంగ్రెస్‌లో కల్లోలానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌లే కారణమని మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం విమర్శించారు. పలు టీవీ ఛానళ్లతో ఆయన విడివిడిగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆ ఇద్దరు నేతలు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకుసాగేలా దిశానిర్దేశం చేయాల్సిన మాణికం ఠాగూర్‌..రేవంత్‌రెడ్డికి సహకరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితిని నేరుగా సోనియాగాంధీకి వివరించాలని ఆయన నిర్ణయించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు