logo

చిరు అభిమానుల కోసం కార్నివాల్‌

‘‘చిరంజీవి పుట్టినరోజుని చాలా గ్రామాల్లో ఓ పండగలా జరుపుకొంటారు. అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈసారి హైదరాబాద్‌ హైటెక్స్‌లో ప్రత్యేకంగా కార్నివాల్‌ని ఏర్పాటు చేస్తున్నాం.

Published : 19 Aug 2022 02:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘చిరంజీవి పుట్టినరోజుని చాలా గ్రామాల్లో ఓ పండగలా జరుపుకొంటారు. అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈసారి హైదరాబాద్‌ హైటెక్స్‌లో ప్రత్యేకంగా కార్నివాల్‌ని ఏర్పాటు చేస్తున్నాం. సకల సదుపాయాలతో కూడిన ఈ కార్నివాల్‌కి అన్ని ప్రాంతాల అభిమానులూ పాల్గొనాల’’ని పిలుపునిచ్చారు నటుడు నాగబాబు. గురువారం  ఆయన హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ‘‘ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అభిమానులంతా ప్రత్యక్షంగా పాల్గొని ఆస్వాదించేలా కార్నివాల్‌ని ఏర్పాటు చేశాం. ఆ సంబరాల్లో మా కుటుంబ హీరోలు, ఇతర నాయకానాయికలు పాల్గొంటారు. మీకెవరికీ తెలియని కొన్ని విషయాల్ని ఈ సంబరాల్లో పంచుకుంటాన’’ని నాగబాబు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని